- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
MS Dhoni-Virat: కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
ఫామ్ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్ కావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: సహచరులకు మద్దతుగా నిలవడంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముందుంటాడు. ఈ మాట అంటోంది టీమ్ఇండియాకు చెందిన ప్లేయర్లు కాదు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సంఘటన అది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనే ఇది జరగడం గమనార్హం. ఇప్పుడంటే దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేవు. కానీ, 2012-13 సీజన్లో భారత్ పర్యటనకు పాకిస్థాన్ (IND vs PAK) వచ్చింది. అప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఉమర్ అక్మల్ ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు. అప్పుడు పెద్దగా ఫామ్లో లేని విరాట్ను సిరీస్ నుంచి తప్పించాలని మేనేజర్ చేసిన సూచనకు ధోనీ షాకింగ్ రిప్లయ్ ఇచ్చినట్లు అక్మల్ తెలిపాడు.
‘‘మేం 2012-13 సీజన్లో భారత పర్యటనకు వెళ్లాం. ఓ రోజు ధోనీ, సురేశ్ రైనా, యువరాజ్, షోయబ్ మాలిక్తో కలిసి డిన్నర్ చేస్తున్నాం. అదే సమయంలో ధోనీ వద్దకు టీమ్ఇండియా (Team India) మేనేజర్ వచ్చారు. విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్లో లేడు. అతడిని వన్డే సిరీస్ నుంచి పక్కనపెడదామని ధోనీకి ఆ మేనేజర్ సూచించాడు. వెంటనే ధోనీ స్పందిస్తూ.. ‘నేను ఇంటికి వెళ్లి ఆరు నెలలు అయింది. విరాట్తో కలిసి నాకూ టికెట్ను ఎందుకు బుక్ చేయకూడదు?’ అని ప్రశ్నించాడు. ఆ సమాధానంతో మేనేజర్ మారుమాట్లాడలేదు. చివరికి కెప్టెన్ అనుకున్నట్లుగానే విరాట్ను ఆడించేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి నేను కూడా ఇదే డౌట్ను ధోనీ ముందు ఉంచా. దానికి రిప్లయ్ ఇస్తూ ‘విరాట్ (Virat Kohli) మా అత్యుత్తమ బ్యాటర్. కేవలం మూడు లేదా నాలుగు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన మేం ఎలా అతడిని పక్కన పెడతాం?’ అని చెప్పాడు. ధోనీ ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఆటగాడికి ఇలాంటి మద్దతు లభిస్తే అంతకుమించిన బహుమానం మరొకటి ఉండదని అనుకున్నా’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. దీంతో ధోనీని విమర్శించే కోహ్లీ అభిమానులు ఇకనైనా నిజం తెలుసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్లోనూ విరాట్ కోహ్లీ ఫైనల్ మినహా మిగతా మ్యాచుల్లో రాణించని విషయం తెలిసిందే. ఇదే మాటను ఫైనల్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను అడిగితే.. ఫైనల్ కోసం కోహ్లీ తన శక్తినంతా దాచి పెట్టాడేమోనని వ్యాఖ్యానించాడు. సరిగ్గా తుది పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన ఇన్నింగ్స్తో (76 పరుగులు) భారత్ విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ధోనీ తర్వాత టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup 2024) నెగ్గిన రెండో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడిన విరాట్కు అప్పుడు ధోనీ.. ఇప్పుడు రోహిత్ మద్దతుగా నిలిచారని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ