- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Suryakumar Yadav: సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను భారత్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియాకు కప్ను అందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup 2024) భారత్ నెగ్గడంలో ఒక్క క్యాచ్ కీలకంగా మారింది. హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ భారీ షాట్కు యత్నించాడు. అంతా సిక్స్ అనుకున్న వేళ.. దూసుకొచ్చిన సూర్యకుమార్ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. అయితే, టీమ్ఇండియా గెలవడం తట్టుకోలేని కొందరు మాత్రం సూర్య క్యాచ్పై విమర్శలు చేశారు. బౌండరీ రోప్ను పక్కకు జరిపారని.. మార్క్ కూడా స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్లు వచ్చాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తంచేశాడు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
‘‘తెల్లగా ఉన్న లైన్ కనిపిస్తోంది. రోప్ను వెనక్కి జరిపారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ ఎవరూ ఏమీ చేయలేదు. మీరు మీ బుర్రలతో ఆలోచించండి. నిబంధనలు ఏంటో తెలుసుకొని మాట్లాడండి. లైన్ను బౌండరీ మార్క్గా అనుకోవడం కరెక్టే. కానీ, లైన్ కంటే రోప్ కాస్త వెనక్కి ఉండటానికి కారణం ఉంది. గ్రౌండ్లో చాలా పిచ్లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్కు ఒక్కో పిచ్ను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకోసం బౌండరీ లైన్ రోప్ను అడ్జస్ట్ చేస్తుంటారు. బార్బడోస్లో ఇదే తొలి మ్యాచ్ కాదు. ఫైనల్ (IND vs SA Final)) కోసం ఎంపిక చేసిన పిచ్ బట్టి బౌండరీ లైన్లను మార్చారు. లేకపోతే గ్రౌండ్ పరిమాణంలో తేడాలు వచ్చేస్తాయి.
పొట్టి కప్ ఫైనల్లోనూ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) రోప్ లోపలే ఉన్నాడు. క్యాచ్ను అందుకొన్నాడు. బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు అనిపించి దానిని లోపలికి విసిరాడు. మళ్లీ వచ్చి బంతిని పట్టేశాడు. ఇందులో ఎక్కడా పొరపాటు లేదు. అంతా క్లియర్గానే ఉంది. మైదానంలో చాలా కెమెరాలు ఉన్నాయి. అవి ప్రతీ యాంగిల్ను రీడ్ చేస్తాయి. ఎక్కడా కూడా సూర్య రోప్ను తాకినట్లు అనిపించలేదు. కొందరు చెబుతున్నట్లుగా క్యాచ్ విషయంలో అస్పష్టత లేదు’’ అని చోప్రా వెల్లడించాడు. అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్నే ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డు వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి
-
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
-
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్