- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gujarat - Gill: చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన ఆ జట్టుకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు రూ. 24 లక్షల జరిమానాను విధిస్తూ ప్రకటన చేసింది. అలాగే జట్టులోని సభ్యులకూ మ్యాచ్ ఫీజ్లో 25 శాతం లేదా రూ. 6 లక్షల వరకు ఫైన్ వేసింది. ప్రస్తుత సీజన్లో గుజరాత్ రెండోసారి స్లో ఓవర్ రేట్కు పాల్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెన్నైపై విక్టరీతో పాయింట్ల పట్టికలో గుజరాత్ (10) ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
గిల్కు ఆ సత్తా ఉంది: గ్రేమ్ స్మిత్
చెన్నైపై సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో 426 పరుగులు చేశాడు. గిల్ ఆట తీరుపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గిల్ సత్తా ఏంటో ఇప్పటికే నిరూపితమైంది. ప్రతి ఏడాది మెరుగ్గా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్ ఆరంభంలోనే కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించాడు. కెప్టెన్గా తొలి ఏడాది కావడం కూడానూ అతడిపై ఒత్తిడి తెచ్చి ఉంటుంది. ఓపెనర్గా బ్యాటింగ్కు వస్తూ కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ.. జట్టును సమర్థంగా నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నాయకత్వం, బ్యాటింగ్ను ఎలా సమతూకంగా నిర్వర్తించాలనే విషయాలను గిల్ త్వరగానే నేర్చుకుంటాడు. అతడి బ్యాటింగ్లోనూ టైమింగ్ అద్భుతంగా ఉంది. చెన్నైపై నలువైపులా షాట్లు కొట్టిన తీరు అభినందనీయం’’ అని స్మిత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు. -
విశ్వవిజేతల విజయ యాత్ర.. క్రికెట్ ఫ్యాన్స్తో జనసంద్రంగా మారిన ముంబయి సముద్ర తీరం
ముంబయిలో టీమ్ఇండియా (Team India) ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ మొదలైంది. రోడ్ షో జరిగే మెరైన్ రోడ్డు అభిమానులతో కిక్కిరిసిపోయింది. -
రోహిత్.. పిచ్ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ
టీ20 ప్రపంచకప్లో విజయం సాధించి స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సరదా ప్రశ్నలు అడుగుతూ మోదీ నవ్వులు పూయించారు. -
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీలా నిలిచే ఆ ఇద్దరు ఎవరంటే? ఈనాడు.నెట్ పాఠకులు చెప్పిన సమాధానం ఇదీ.. -
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. -
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. -
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
పాకిస్థాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్ అంటూ హంగామా చేసి పొట్టి కప్లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. -
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. -
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
వరల్డ్ కప్తో కెప్టెన్ రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్తో అలరించాడు. వరల్డ్ కప్తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తల్లిదండ్రుల్ని చంపేసి.. ఇంట్లోనే దాచేసి..
-
బాలికపై లైంగిక వేధింపులు.. వైకాపా మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్
-
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో గంజాయి కలకలం
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?