- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs ENG: అప్పటిలా కాదు.. ఈసారి టీమ్ఇండియాదే విజయం: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియానే ఫేవరేట్ అని పలువురు అంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 world cup) తుది అంకానికి చేరుకుంది. సెమీస్ పోరులో తలపడేందుకు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. గురువారం రెండో సెమీస్లో ఇంగ్లాండ్ను టీమ్ఇండియా(IND vs ENG) ఢీకొననుంది. 2022లో ఇంగ్లిష్ టీమ్పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని.. ఐసీసీ ట్రోఫీల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ప్రతీ భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన(Rohit Sharma) ఓటమే ఎరగకుండా.. ఈ టోర్నీలో సెమీస్ వరకు దూసుకొచ్చింది.
ఈ టోర్నీలో పటిష్ఠమైన స్థితిలో ఉన్న టీమ్ఇండియానే ఫేవరేట్గా కనిపిస్తోందని.. అయితే ఇంగ్లాండ్ను తక్కువగా అంచనా వేయకూడదని పలువురు అంటున్నారు. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరిగా భారత్ ఈసారి ఓడిపోదని విశ్వాసం వ్యక్తంచేశాడు.
‘‘ఎంతో గొప్పగా ఉన్న ఇండియా టీమ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫిట్నెస్, కచ్చితత్వం, పేస్, అత్యంత నైపుణ్యంతో బంతులు సంధిస్తున్నాడు. అతడి బంతులను ఎదుర్కొనేందుకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవు. పొట్టి ఫార్మాట్లో అతడు వేసే 24 బంతులు జట్టు విజయంలో కీలకమవుతాయి. కఠిన పరిస్థితులు ఉన్న అమెరికాలాంటి పిచ్లపై కూడా రోహిత్ సేన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఇక ఆ జట్టు సారథి రోహిత్.. ఆసీస్పై అద్భుతమైన ఇన్నింగ్స్తో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. నిజాయతీగా చెప్పాలంటే.. ఈసారి టీమ్ఇండియా ఓడిపోదనే నేను అనుకుంటున్నాను. ఆ జట్టును ఓడించాలంటే ఇంగ్లాండ్ అసాధారణ రీతిలో పోరాడాల్సి ఉంటుంది’’ అని విశ్లేషించాడు.
ఇంగ్లాండ్ నాకౌట్ దశలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, భయం లేకుండా ఆడుతుందని కాలింగ్వుడ్ పేర్కొన్నాడు. ‘సారథి బట్లర్ గొప్ప పామ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ఎంతో సానుకూలంగా ఉంది. ఇరు జట్లు ఎంతో దూకుడుగా బరిలోకి దిగుతాయి. ఈనేపథ్యంలో పిచ్ కీలకమవుతుంది. ఇలాంటి ఫ్లాట్ పిచ్పై ఇంగ్లాండ్దే పైచేయి అయినప్పటికీ.. స్లో, టర్నింగ్ పిచ్ భారత్కు అనుకూలంగా ఉంటుంది’’ అని వివరించాడు.
2022 పొట్టి ప్రపంచకప్ సెమీస్లో టీమ్ఇండియా.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ సేన ఘన విజయం సాధించింది. ఆ ఓటమిని మరచిపోవడం అంత ఈజీ కాదు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్కి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం తుది పోరుకు వేళైంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ వేట జరగనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. -
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
రెండోసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకొనే అద్భుతమైన అవకాశం టీమ్ఇండియాకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది. -
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
టీ20 ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడు. టీమ్ఇండియా విజయాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి మాజీ క్రికెటర్లు గట్టిగా బదులిచ్చారు. -
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ
-
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు
-
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
-
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
-
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం