Dinesh Karthik: ‘ఆ భారత బౌలర్‌ కోహినూర్ వజ్రం కంటే విలువైనోడు’

భారత్ 2024 టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రాపై టీమ్ఇండియా మాజీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు.

Published : 03 Jul 2024 23:41 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ 2024 టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)  కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. మొత్తం 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై టీమ్ఇండియా మాజీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik)  ప్రశంసలు కురిపించాడు. 

‘‘ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌. అతడు కోహినూర్ వజ్రం కంటే విలువైనవాడు. కామెంటరీలో కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పా. ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అదే అతడి స్పెషల్. ఇది అందరికి సాధ్యం కాదు. బుమ్రా వంటి బౌలర్‌ జట్టులో ఒకరు ఉండాలని ప్రతీ కెప్టెన్‌ కోరుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు రాణించగలడు. నిజంగా బ్రిలియంట్’’ అని డీకే కొనియాడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని