- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Devdutt Padikkal: అనారోగ్యంతో 10కిలోల బరువు తగ్గా: దేవ్దత్ పడిక్కల్
తన కెరీర్లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను టీమ్ ఇండియా యువ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ వివరించాడు. తాజాగా టెస్ట్ జట్టు నుంచి పిలుపు వచ్చిన వేళ తొలిసారి స్పందించాడు.
ఇంటర్నెట్డెస్క్: అనారోగ్యంతో గత సీజన్లో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కర్ణాటక యువ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal) పేర్కొన్నాడు. రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరగనున్న మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా నుంచి పిలుపునందుకొన్న తర్వాత అతడు స్పందించాడు. టెస్టుల్లో ఆడటం తన కల అని పేర్కొన్నాడు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతూనే 2022-23 సీజన్ ఆడినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో తరచూ అనారోగ్యం పాలవ్వడంతో దాదాపు 10 కిలోల బరువు కోల్పోయినట్లు వెల్లడించాడు.
‘‘టెస్టు జట్టులోకి పిలుపు రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. దానిలో స్థానం దక్కించుకోవడం నా కల. కెరీర్లోనే చాలా కఠినమైన కాలం గడిచాక ఈ అవకాశం వచ్చింది. నా శ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి కోలుకొని.. ఫిట్నెస్ సాధించడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో ఏకంగా 10 కిలోల బరువు తగ్గాను. ఆ సమయంలో సరైన ఆహారం, కండరాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టా’’ అని పడిక్కల్ పేర్కొన్నాడు.
సోమవారం కర్ణాటక-తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్లో పడిక్కల్ రెండో ఇన్నింగ్స్లో పోరాడి మ్యాచ్ను డ్రా అయ్యేట్లు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 36 రన్స్ చేశాడు. గతంలో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిధ్యంవహించి అహ్మదాబాద్లో ఇంగ్లాండ్పై అర్ధశతకం సాధించాడు. గతేడాది అంతర్జాతీయ జట్టులో టీ20 కెరీర్ను ప్రారంభించి రెండు మ్యాచ్లు ఆడాడు. వీటిల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 2022-23 సీజన్లో అనారోగ్యం కారణంగా ఐపీఎల్లో కూడా రాణించలేకపోయాడు.
బాడీషేమింగ్ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన బుమ్రా సతీమణి
తాజాగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇంగ్లాండ్తో మూడో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ దేవ్దత్ పడిక్కల్ను అతడి స్థానంలో ఎంపిక చేసింది. ‘‘రాహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడు 90 శాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడు. బీసీసీఐ వైద్యుల బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లీకి తెలియదు: మాజీ క్రికెటర్లు
బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరుపై విరాట్-రోహిత్ మాట్లాడుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. -
సెమీఫైనల్కు ఇలాంటి మైదానమా?.. అఫ్గాన్ కోచ్ అసహనం
టీ20 సెమీఫైనల్ 1కు ఎంపిక చేసిన మైదానంపై అఫ్గానిస్థాన్ కోచ్ టార్ట్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. -
కోహ్లీ, రోహిత్లను సరిపోల్చలేం.. సోషల్మీడియా వార్పై కపిల్దేవ్ స్పందన
Kapil Dev: టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, కోహ్లీలను సరిపోల్చడం తగదని మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. ఎవరి శక్తిసామర్థ్యాలు, ఆట వారివని చెప్పారు. -
విరాట్ - రోహిత్లకు ముప్పు పొంచి ఉందిలా..!
టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ - విరాట్ మన బ్యాటింగ్ లైనప్కు దిశానిర్దేశం చేయనున్నారు. వీరిలో ఒక్కరు రెచ్చిపోయినా జట్టు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంగ్లాండ్ అమ్ముల పొదిలో వీరిపై ప్రయోగించడానికి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చదవండి. -
అందరి దృష్టి రెండో సెమీఫైనల్పైనే .. వాతావరణం లేటెస్ట్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇది సమష్టి విజయం.. ఫైనల్ కోసం భయం లేదు: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్ సిరీస్లో తొలిసారిగా ఫైనల్కు చేరడం చాలా ఆనందంగా ఉందని మార్క్రమ్ అన్నాడు. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు. -
అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్తో సెమీస్పై కెప్టెన్ రోహిత్
IND Vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్-2లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అనుసరించే వ్యూహాల సహా పలు అంశాలపై కెప్టెన్ రోహిత్ మాట్లాడాడు. -
ఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్థాన్పై అలవోక విజయం
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఫైనల్కు దూసుకెళ్లింది. అఫ్గాన్స్థాన్తో జరిగిన సెమీస్ పోరులో ఘన విజయం సాధించింది. -
చేతులెత్తేసిన అఫ్గాన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా లక్ష్యం 57
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో సెమీస్-1 మ్యాచ్లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు ఆలౌటయ్యారు. -
నితీశ్కు గాయం.. దూబెకు చోటు
యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ. టీమ్ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్రౌండర్ ఎదురు చూడక తప్పదు. -
సమరానికి భారత్ సై... కాస్కో ఇంగ్లాండ్
ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ను గెలిచాం. జట్టు నిండా ఐపీఎల్తో పొట్టి క్రికెట్లో ఆరితేరిన ఆటగాళ్లున్నా.. తర్వాత అనేక ప్రయత్నాల్లో అది అందనే లేదు. -
తొలి ఫైనల్ ఎవరిదో...
టీ20 ప్రపంచకప్లో రసవత్తర సమరానికి వేళైంది. సంచలన ప్రదర్శనతో క్రికెట్ పండితులను ఆశ్చర్యపరిచిన అఫ్గానిస్థాన్ గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో డార్క్హార్స్ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. -
క్వార్టర్స్లో అర్జెంటీనా
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు కోపా అమెరికాలో క్వార్టర్ఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్-ఎ మ్యాచ్లో ఆ జట్టు 1-0తో చిలీపై విజయం సాధించింది. -
హర్మన్ సారథ్యంలో ఒలింపిక్స్కు
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. -
జాతీయ అథ్లెటిక్స్ నేటి నుంచే
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు రంగం సిద్ధమైంది. గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. -
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్
టీ20 ప్రపంచకప్లో సెమీస్కి చేరి అఫ్గానిస్థాన్ అద్భుతం సృష్టించింది. గతంలో కెన్యా కూడా ఇలానే సంచలనం సృష్టించింది. -
అతడి బౌలింగ్ వీడియో గేమ్లా ఉంటుంది.. : బుమ్రాను కొనియాడిన అర్ష్దీప్
ఈ పొట్టి ప్రపంచకప్లో బుమ్రా, అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రామోజీరావుకు పుష్పాంజలి ఘటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
-
రాజదండంపై ఎస్పీ వ్యాఖ్యలు.. మండిపడ్డ యోగి
-
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లీకి తెలియదు: మాజీ క్రికెటర్లు
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
సూచీల రికార్డుల పరుగు.. సెన్సెక్స్@ 79000.. నిఫ్టీ@ 24000