- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hardik Pandya: ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
ఐపీఎల్ సందర్భంగా ఎదురైనా అవమానాలను తట్టుకొని.. వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్య తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్తో భారత విజయంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్గా ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక చివరి బంతిని వేసిన తర్వాత భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయాడు. కన్నీటితో సహచరులను హత్తుకున్నాడు. మ్యాచ్ అనంతరం కంట్రోల్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డేవిడ్ మిల్లర్ను ఔట్ చేసిన పాండ్య (Hardik Pandya) మ్యాచ్ను మలుపు తిప్పాడు.
‘‘ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కష్టానికి ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న గొప్ప విజయాన్ని సాధించాం. మరీ ముఖ్యంగా ఇది నాకెంతో స్పెషల్. గత ఆరు నెలలు ఎలా గడిచాయో తెలిసిందే. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుకోని విషయాలు జరిగిపోయాయి. కష్టపడుతూ ఉంటే మరింత మెరుగవుతామని నాకు తెలుసు. అదే నేను చేశా. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. మా ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో విజయం సొంతమైంది.
నాకు వారెవరో ఒక్క శాతం కూడా తెలియని వ్యక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. వాటితో నాకేమీ సమస్య లేదు. నేనెంటో తెలియజెప్పడానికి మెరుగైన మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడీ ప్రదర్శనతో వారే సంతోషంగా ఉంటారనుకుంటా. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా తక్కువగా లభిస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడం కీలకం. నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. నైపుణ్యాలపైనే దృష్టిపెట్టా. చివరి ఐదు ఓవర్లలో మేం పుంజుకున్న తీరు అద్భుతం. బుమ్రా (Bumrah) మ్యాచ్ ఛేంజర్. నేను కూడా వందశాతం నిబద్ధతతో ప్రతి బంతిని విసిరా’’ అని హార్దిక్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- పొట్టి కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకొన్న రెండో భారత క్రికెటర్గా బుమ్రా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) రెండుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
- టీ20 అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లను గెలిచిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 125 మ్యాచుల్లో 16 అందుకోగా.. సూర్య 68 మ్యాచుల్లో 15 దక్కించుకున్నాడు.
- రెండేసి వరల్డ్ కప్లు గెలిచిన మూడో టీమ్ భారత్ (Team India). ధోనీ నాయకత్వంలో 2007లో విజేతగా నిలిచింది. టీమ్ఇండియా కాకుండా.. వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లాండ్ (2010, 2022) సాధించాయి.
- ఒకే టీ20 ప్రపంచ కప్లో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్ భారత్. ఈసారి 8 మ్యాచుల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కూడా ఇదే ఎడిషన్లో ఎనిమిదింట్లో గెలిచింది.
- కెప్టెన్గా అత్యధిక టీ20ల్లో జట్టును గెలిపించిన క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma). మొత్తం 50 మ్యాచులను నాయకుడిగా గెలిపించాడు. బాబర్ అజామ్ (49)ను అధిగమించాడు.
- టీ20 ప్రపంచకప్లో అత్యల్ప ఎకానమీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (4.17). ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ (17). ఓవరాల్గా ఫరూఖితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
- వరల్డ్ కప్ ఫైనల్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ హార్దిక్ పాండ్య. ఈ మ్యాచ్లో 3/20 ప్రదర్శన చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
-
రోహిత్ తర్వాత ఎవరు..?
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్