- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AUS vs IND: 33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి.
(పాత చిత్రం)
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 (WTC) సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. నవంబర్ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం గమనార్హం. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ చేతిలోనే టీమ్ఇండియా ఓడింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్ సిద్ధం కానుంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి ఇకపై టెస్టులపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. డబ్ల్యూటీసీ టైటిల్ను కూడా ఖాతాలో వేసుకోవాలనేది రోహిత్ ప్లాన్. అందుకు ఈ టెస్టు సిరీస్ కీలకంగా మారనుంది.
భారత అభిమానుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (AUS vs IND) పెద్దఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠగా ఉంటుందనే ఉద్దేశంతో భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘ఫ్యాన్ జోన్స్’ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈసారి మైదానాల్లో ప్రత్యక్షంగా టీమ్ఇండియా అభిమానులు చూసేందుకు వీలుగా ఎక్కువగా టికెట్లను అందుబాటులో ఉంచింది. గత సీజన్తో పోలిస్తే అవి దాదాపు ఆరు రెట్లు వరకు అధికంగా ఉంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా జనరల్ మేనేజర్ జోయల్ మోరిసన్ తెలిపారు.
‘‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చేందుకు భారత (Team India) అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. వారిని సాదరంగా ఆహ్వానించి.. ఈ సిరీస్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాం. అందులో భాగంగా ఫ్యాన్ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచ్లను ఆస్వాదించడంతోపాటు సంబరాలు చేసుకునే వీలుగా ఈ వేదికలు ఉంటాయి’’ అని జోయల్ స్పష్టం చేశారు.
షెడ్యూల్ ఇలా..
- తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్)
- రెండో టెస్టు: డిసెంబర్ 06-10 (అడిలైడ్)
- మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (బ్రిస్బేన్)
- నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26-30 (మెల్బోర్న్)
- ఐదో టెస్టు: జనవరి 03-07 (సిడ్నీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో రోహిత్తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. -
భారత కోచ్గా గంభీర్! ఈడెన్ గార్డెన్స్లో ఫేర్వెల్ వీడియో షూట్
టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. -
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
-
రూ.10 లక్షలకు ఆయుష్మాన్ భారత్.. మరింత మందికి పథకం విస్తరణ?
-
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణులు వ్యవహరించాలి: పవన్
-
చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్ విజ్ఞప్తి.. ఎక్స్ వేదికగా పోస్ట్!
-
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
-
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..