- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Team India: స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియా గురువారం స్వదేశంలో అడుగుపెట్టింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో ఉదయం దిల్లీకి చేరుకున్నారు. అనంతరం రోహిత్ సేన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లింది. అక్కడ హోటల్ సిబ్బంది టీమ్ఇండియాకు ఘన స్వాగతం పలికారు. భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రుచికరమైన అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డించారు. బ్రేక్ఫాస్ట్లో బఫెట్లో స్థానికంగా లభించే తాజా సీజనల్ పండ్లను కూడా ఉంచారు.
కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ముంబయి స్టైల్ వడాపావ్ (Vada pav) వడ్డించగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli)కి అమృత్సర్ స్టైల్ చోలే బటూరే’ (Chole Bhature)ని అల్పాహారంగా అందించారు. అంతేకాకుండా ఆటగాళ్లు తినడానికి వారి గదుల్లో చేతితో చుట్టిన చాక్లెట్ ట్రఫుల్ రోల్స్ ఉంచారు. క్రికెట్ను ప్రతిబించేలా చాక్లెట్తో బాల్స్, బ్యాట్స్, పిచ్ను తయారుచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి హోటల్ నుంచి బయలుదేరే ముందు టీమ్ఇండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కట్ చేశారు. ఈ కేక్పై టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ నమునా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ముంబయికి వెళ్లింది. సాయంత్రం 5 గంటలకు రోడ్షో, అనంతరం వాంఖడే వేదికగా సన్మానం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహకులు భారత్కు అనుకూలంగా వ్యవహరించారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. -
పైనల్ మ్యాచ్ వేదికపై ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలు.. బదులిచ్చిన బీసీసీఐ
భారత్లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్ మ్యాచ్లకు ముంబయి వేదిక కావాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కోరడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. -
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. -
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్లోనూ తాను ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. విభజన అంశాలపై చర్చ
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
-
బ్రిటన్ నూతన ప్రధానికి మోదీ ఫోన్.. ‘ఎఫ్టీఏ’పై ఏమన్నారంటే..!
-
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM