- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Afghanistan vs South Africa: ఇది సమష్టి విజయం.. ఫైనల్ కోసం భయం లేదు: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్ సిరీస్లో తొలిసారిగా ఫైనల్కు చేరడం చాలా ఆనందంగా ఉందని మార్క్రమ్ అన్నాడు. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు.
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా (South Africa) ఫైనల్కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్ను (Afghanistan) చిత్తుచిత్తుగా ఓడించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సిరీస్లో తొలిసారిగా ఫైనల్కు చేరడం చాలా ఆనందంగా ఉందన్నాడు. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు. ‘‘ తెలివైన బౌలింగ్ చేసి.. సరైన సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టాం. పిచ్ చాలా కఠినంగా ఉంది. బ్యాటింగ్ చేయడం సవాల్గా మారింది. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. వెంటవెంటనే వికెట్లు తీయడం మమ్మల్ని సులువుగా విజయతీరాలకు చేర్చింది. కప్ను సొంతం చేసుకోవాలంటే ఇంకో మెట్టు ఎక్కాల్సిఉంది. ఇలాంటి సందర్భం ఇప్పటివరకు మాకు రాలేదు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఫైనల్ మ్యాచ్ కోసం భయపడటం లేదు. ఈ విజయమే మాకు ఎంతో గొప్ప. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. విజయం సాధించాలంటే అందరి సమష్టి కృషి అవసరం. ఫైనల్ మ్యాచ్లో అలాంటి ప్రదర్శన చేస్తాం’’ అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
పిచ్ సవాల్గా మారింది : రషీద్ఖాన్
అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. పిచ్ సవాల్గా మారిందన్నాడు. మరికాస్త ప్రదర్శన చేయాల్సి ఉన్నప్పటికీ పిచ్ పరిస్థితులు అనుకూలంగా లేవన్నాడు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అదే.. టీ20 క్రికెట్ అని అన్నాడు. ‘‘ దక్షిణాఫ్రికా బాగా బౌలింగ్ చేసింది. ముజీబ్ గాయపడటం ఓ రకంగా మాకు దురదృష్టమే. మా పేసర్లతోపాటు నబీ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయి. మా ప్రయత్నాన్ని ఎప్పుడూ కొనసాగిస్తాం. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీ చక్కని అవకాశాన్నిచ్చింది. మా నైపుణ్యాలను ఉపయోగించడంలో ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి.. సరిదిద్దుకుంటాం. ముఖ్యంగా మిడిలార్డర్లో మేం మెరుగుపడాల్సి ఉంది. మరింత హార్డ్వర్క్ చేసి మున్ముందు సిరీస్లకు సిద్ధమవుతాం’’ అని చెప్పాడు.
- వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో గత 32 ఏళ్లలో దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి.
- 1992 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వరకు వెళ్లింది.
- ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 1999 వరల్డ్ కప్ సెమీస్ టైగా ముగిసింది.
ఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్థాన్పై అలవోక విజయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
-
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM