- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pak Cricket Team: బాబ్బాబు.. 2500 డాలర్లు ఇవ్వండి వచ్చేస్తాం: ఈవెంట్లకు హాజరైన పాక్ ప్లేయర్లు
పాకిస్థాన్ క్రికెటర్లు చేసిన ఒక్కో విషయం తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్ కప్ కోసం కుటుంబాలను వెంట తీసుకెళ్లిన వారు.. ప్రత్యేకంగా ఈవెంట్లలోనూ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించడంతో పాకిస్థాన్పై ఆ దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్రికెట్ ఆడటానికి వెళ్లారా? కుటుంబాలతో హాలిడే ట్రిప్లకు వెళ్లారా? అని మాజీలు ప్రశ్నించారు. కొందరు పాక్ క్రికెటర్లు వెంటనే స్వదేశానికి వెళ్లకుండా ఉండిపోయారు. యూఎస్ఏతోపాటు ఇంగ్లాండ్లో గడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, పీసీబీ తీవ్రంగా స్పందించడంతో పాక్కు చేరుకున్నారు. తాజాగా మరో విషయం క్రికెట్ వర్గాలను షాక్కు గురిచేస్తోంది. ఈవెంట్లలో పాల్గొనేందుకు పాక్ క్రికెటర్లు చాలా తక్కవ మొత్తం ఇచ్చినా తీసుకొన్నారని కథనాలు వస్తున్నాయి . డలాస్లో ‘ఏ నైట్ విత్ స్టార్స్’తోపాటు మరొక ఈవెంట్లోనూ పాల్గొన్నారని సమాచారం. క్రికెట్ మ్యాచ్లపై దృష్టిపెట్టకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు విమర్శలు వచ్చాయి. బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది నేతృత్వంలో జట్టు విడిపోయిందనే కథనాలూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరికి పేమెంట్లలోనూ వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం.
‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో క్రికెటర్లు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇందులో సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది వారిలో చాలామందికి సెంట్రల్ కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. వాటిపై పునఃసమీక్షించే పరిస్థితి ఉంది. అందుకోసం పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ కొందరితో ఇప్పటికే చర్చించారు. భవిష్యత్తులో ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
అంపైర్లు దృష్టిపెట్టాలి: ఇంజమామ్
భారత్ సెమీస్కు చేరుకోవడం.. పాక్ లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టడం ఇప్పటికీ కొందరు మాజీ క్రికెటర్లకు మింగుడుపడటం లేదు. దీంతో టీమ్ఇండియా మ్యాచ్లపై ఓ కన్నేసి విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. అందులో మాజీ క్రికెటర్ ఇంజామమ్ ఉల్ హక్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారత్ బాల్ టాంపరింగ్కు పాల్పడిందని ఆరోపించాడు. ‘‘సాధారణంగా పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టవచ్చు. కానీ, ఆసీస్తో మ్యాచ్లో భారత బౌలర్లు కొత్త బంతితో ఎలా రాబట్టారు? అంపైర్లు కాస్త ఇలాంటి వాటిపై దృష్టిపెట్టండి’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి రోజు ఆట పూర్తి.. భారత మహిళల రికార్డు స్కోరు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా తొలిరోజు ఆటముగిసింది. భారత్ మహిళా జట్టు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. -
ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్డే నాడూ మ్యాచ్ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్..?
ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. -
నమ్మడం.. నడిపించడం.. ఇదే రోహిత్ మార్క్ కెప్టెన్సీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. -
భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?
టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్-8, సెమీస్లను దాటేసి ఫైనల్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. -
వారెవ్వా.. అదిరిపోయే ధోనీ న్యూ లుక్ చూశారా?
MS dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ న్యూ హెయిర్స్టైల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘ఒకరి కోసం కప్ గెలవాలి’.. నేను ఇలాంటివి అస్సలు నమ్మను: ద్రవిడ్
టీ20 ప్రపంచకప్లో రెండోసారి విజేతగా నిలవాలని టీమ్ఇండియా ఎదురుచూస్తోంది. ఇప్పుడా అవకాశం వచ్చింది. పొట్టి కప్ 2024లో ఫైనల్కు చేరింది. -
దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు దూకుడుగా ఆడుతోంది. -
భారత్ విజయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అక్కసు.. పిచ్పై ప్రేలాపనలు..!
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెన్ వాన్ గయాన పిచ్పై చేసిన ప్రేలాపనలకు భారత సీనియర్, మాజీ ఆటగాళ్లు బలంగా కౌంటర్ ఇచ్చారు. -
రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్గా రికార్డు
సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్ ఫైనల్కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్తో రాణించాడు. -
బ్యాటర్ల దూకుడు.. బౌలర్ల విజృంభణ.. భారత్ విజయం.. ఇవిగో వీడియోలు!
ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో టీమ్ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఇక ఫీల్డింగ్లోనూ మెరుపులతో అదరగొట్టేశారు. -
ఆ ఒక్క ట్రిక్ పాటించా.. వికెట్లు సాధించా: అక్షర్ పటేల్
భారత విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ముగ్గురు డేంజరస్ బ్యాటర్లు బట్లర్, బెయిర్స్టో, మొయిన్ అలీ వికెట్లు పడగొట్టాడు. -
రోహిత్ శర్మ భావోద్వేగం.. ‘కమాన్ మ్యాన్ చీర్స్’ అన్న విరాట్ కోహ్లీ!
టీమ్ఇండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. అయితే, సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన తర్వాత రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. -
కోహ్లీకి ఫామ్ సమస్యే కాదు.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు: రోహిత్ శర్మ
ఇంగ్లాండ్పై ఘన విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
వావ్ రిషభ్ పంత్.. సూపర్ స్టంపింగ్.. వీడియో వైరల్
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేశాడు.
-
రోహిత్ హిట్టింగ్.. అక్షర్ టర్నింగ్.. మ్యాచ్ హైలైట్స్ అదుర్స్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు టీమ్ఇండియా దూసుకుపోయింది. సెమీస్లో ఇంగ్లాండ్ను అలవోకగా చిత్తు చేసి మూడోసారి టైటిల్ రేసులో నిలిచింది.
-
దెబ్బకు దెబ్బ
గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్! ఇంగ్లాండ్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్ జట్టు. -
ఎన్నాళ్లో వేచిన విజయం
ఓ అద్భుత ప్రస్థానానికి అనుకోని ముగింపు. పాపం.. అఫ్గానిస్థాన్! సంచలన ప్రదర్శనతో, పోరాటపటిమతో అంచనాలను అమాంతం పెంచేసి క్రికెట్ ప్రపంచం దృష్టినంతా తనవైపే తిప్పేసుకున్న ఈ జట్టు.. సెమీఫైనల్లో చతికిల పడింది. -
పోర్చుగల్కు షాక్.. నాకౌట్కు జార్జియా
యూరో కప్లో సంచలనం. గురువారం గ్రూప్- ఎఫ్ మ్యాచ్లో అగ్రశ్రేణి జట్టు పోర్చుగల్కు షాకిచ్చిన జార్జియా నాకౌట్కు అర్హత సాధించింది. 2-0 తేడాతో రొనాల్డో జట్టుపై జార్జియా నెగ్గింది. ఇప్పటికే పోర్చుగల్ రౌండ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
కౌంటీల్లో రహానె
టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె మరోసారి ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ సీజన్ కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లీసెస్టర్షైర్ క్లబ్ గురువారం ప్రకటించింది. -
జోరు కొనసాగిస్తారా!
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం సఫారీలతో ఆరంభమయ్యే ఏకైక టెస్టులోనూ అదరగొట్టాలని హర్మన్ప్రీత్ బృందం బరిలో దిగుతోంది. -
గుకేశ్ శుభారంభం
సూపర్బెట్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ శుభారంభం చేశాడు. గురువారం తొలి రౌండ్లో బోగ్డాన్ డానియల్ (రొమేనియా)పై అతడు విజయం సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
భూ కుంభకోణం కేసులో బెయిల్.. హేమంత్ సోరెన్ విడుదల
-
ఫీల్డింగ్ మెడల్ ఎవరికి? ఎవరిచ్చారంటే?
-
షాద్నగర్లోని పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
-
ఒక సీఎంకు 986 మందితో భద్రతా?: చంద్రబాబు ఆశ్చర్యం
-
రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా: సోమిరెడ్డి
-
నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ