- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..
T20 World Cup: తీవ్ర ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికాపై గెలుపొంది కప్పు కైవసం చేసుకుంది భారత క్రికెట్ టీమ్. ఈ పొట్టి కప్ కోసం జరిగిన తుది మ్యాచ్లో జట్టు అన్ని విభాగాల్లో రాణించింది. ఈ సందర్భంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికొచ్చిందో చూద్దాం..
T20 World Cup | ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠ రేకెత్తిన టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) తుది మ్యాచ్లో ఎట్టకేలకు విజయం భారత్ వశమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు చిరస్మరణీయ గెలుపును అందించారు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది అభిమానుల కలను నిజం చేశారు. మరి ఇలాంటి చరిత్రాత్మక మ్యాచ్లో ఉత్తమ ఫీల్డర్ ఎవరై ఉంటారు?... ఇంకెవరు.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్తో జట్టు విజయాన్ని ఖాయం చేసిన మన సూర్య కుమార్ యాదవే (Surya kumar Yadav)..
కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ఉత్సాహంతో నిండిపోయింది. ప్లేయర్లంతా ఒక్కచోట కూర్చొని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ తరుణంలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రదానం చేయడానికి బీసీసీఐ సెక్రటరీ జైషాను ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజును మనం జయించాం. నేటితో పాటు టోర్నమెంట్ ఆసాంతం మనం చూపిన తెగువ, పట్టుదల అద్భుతం. ద్రవిడ్, రోహిత్ ప్రతిఒక్కరికీ తమ పాత్రేంటో తెలుసని చెబుతూనే ఉన్నారు. కానీ, మనం కలసికట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వేటాడాం. దేన్నీ వదిలిపెట్టలేదు’’ అని దిలీప్ అన్నారు.
అనంతరం సూర్యకుమార్కు (Surya kumar Yadav) జైషా మెడల్ను ప్రదానం చేశారు. దీనిపట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. వరల్డ్ కప్ మెడల్తో పాటు దాన్నీ కెమెరాకు చూపుతూ ఉత్సాహంగా కనిపించాడు.
సూర్య అలాంటివి ఒక 50 పట్టి ఉంటాడు..
మరోవైపు మ్యాచ్ అనంతరం సూర్య క్యాచ్ గురించి మాట్లాడుతూ దిలీప్ అతడిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘ప్రాక్టీస్ సమయంలో సూర్య అలాంటి క్యాచ్లు ఒక 50 వరకు పట్టి ఉంటాడు. కానీ, ఫీల్డ్కు వచ్చే సరికి పరిస్థితులను బట్టి వేగంగా నిర్ణయం తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. బంతిని అంచనా వేయడంతో పాటు బౌండరీని దృష్టిలో ఉంచుకోవాలి. అది చాలా క్లిష్టమైన విషయం. పైకి ఎగరేసి తిరిగి క్యాచ్ పట్టగలమన్న విశ్వాసం ఉండాలి. ఇవన్నీ క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. దాన్ని సూర్య సమర్థంగా చేయగలిగాడు’’ అని దిలీప్ వివరించారు.
చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. వైడ్ లాంగాఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య (Surya kumar Yadav) ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ, నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి దాన్ని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. ఆ అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
-
ఆస్ట్రేలియా కల మరింత భారం..!
-
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
-
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
-
భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్