T20 world cup: రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్‌సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్‌మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది.

Updated : 01 Jul 2024 04:50 IST

పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్‌సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్‌మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. భారత జట్టుకు బీసీసీఐ ఆదివారం రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ‘‘టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా. టోర్నీ ఆసాంతం జట్టు అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి అభినందనలు’’ అని బీసీసీఐ కార్యదర్శి  జై షా ఎక్స్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని