Novak Djokovic: మీకు ఇంకేం ప్రశ్నలు లేవా? ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన జకోవిచ్!
పదే పదే ఒకే విషయంపై ప్రశ్నలు వేయడంతో టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ప్రేక్షకులు కూడా సరైన మర్యాద పాటించకపోవడంపైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వింబుల్డెన్ 2024 ఎడిషన్లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)కు ప్రేక్షకుల నుంచి విభిన్న అనుభవం ఎదురైంది. రౌండ్ 16 సందర్భంగా హోల్గర్ రూనెతో జకోవిచ్ పోటీపడ్డాడు. ఆ మ్యాచ్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకుపోయాడు. ఇవాళ మినౌర్తో తలపడనున్నాడు. అయితే, నాలుగో రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఓ రిపోర్టర్తో జకోవిచ్ మాట్లాడుతూ ఉండగానే ప్రేక్షకులు అరుపులతో హోరెత్తించారు. అగౌరవంగా ప్రవర్తించడంపై జకోవిచ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. కొందరు తమ పరిధిని దాటారని.. ఇలా చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేశాడు.
‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఉంటా. రోజంతా టెన్నిస్ను చూస్తూ ప్రోత్సహించడం సులువేం కాదు. అందుకోసం వారికి థాంక్స్ చెబుతా. ఇప్పటికీ నేను ఆడుతున్నానంటే దానికి కారణం వారి మద్దతే. కానీ, ఇవాళ కొందరు హద్దులు దాటారు. ఇలాంటప్పుడు తప్పకుండా వెంటనే స్పందిస్తా. కోర్టులో చేసే వ్యాఖ్యలు, చర్యలకు నేనేం పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు’’ అని సమాధానం ఇచ్చాడు.
దానిపైనే దృష్టి పెడతారా?
ఆ రిపోర్టర్ మరోసారి ప్రేక్షకులకు సంబంధించిన ప్రశ్ననే అడిగారు. దాంతో జకోవిచ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఈ టాపిక్ కాకుండా మరే ప్రశ్నలు లేవా? అని ప్రతిస్పందించాడు. ‘‘ప్రేక్షకుల ప్రవర్తన వ్యవహారం కాకుండా ఇతర ప్రశ్నలు మీ దగ్గర లేవా? మీరు కేవలం దానిపైనే దృష్టి పెడతారా? ఇప్పటికే మూడు ప్రశ్నలు అడిగారు. ఇక సరిపోతుంది. ఇతర విషయాలపై మనం మాట్లాడుకుంటే బెటర్’’ అని ఇంటర్వ్యూని ముగించాడు. ఆ తర్వాత మీడియా సంస్థ కూడా ఈ వ్యవహారంపై పోస్టు చేసింది. ప్రేక్షకులకు సంబంధించిన ప్రవర్తనపై స్పందించాల్సిందిగా జకోవిచ్ను అడగ్గా.. మధ్యలోనే వెళ్లిపోవడం జరిగిందని పేర్కొంది.
ఇంతకీ ఏమైందంటే?
డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థి రూనెతో మ్యాచ్లో ఓ పాయింట్ విషయంలో జకోవిచ్ అప్పీలు చేశాడు. ఆ సమయంలో రూనెకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రేక్షకుల్లో కొందరు విపరీతంగా ప్రవర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మైదానంలోనే జకోవిచ్ స్పందించాడు. ‘మీరు కనీసం నన్ను టచ్ కూడా చేయలేరు’ అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. షూటింగ్లో ఫైనల్కు మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మను బాకర్ అదరగొట్టింది. మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. -
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బిల్గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ పడుతున్నాడు. -
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒక్క రోజే 28 లక్షలు
-
విస్తారా కీలక నిర్ణయం.. ఆ విమానాల్లో 20 నిమిషాలు ఫ్రీ వైఫై..!
-
‘మహారాజ’ ఆ ట్విస్ట్కు ‘దిమ్మతిరిగి మబ్బులు మెరిసిపోతాయి’..
-
కమల రాక.. తగ్గిన ట్రంప్ ఆధిక్యం!
-
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పేరుతో.. రూ.3.25 కోట్ల మోసం
-
2న ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ సబ్స్క్రిప్షన్.. వారికి ఒకరోజు ముందుగానే