- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Haris Rauf: అభిమానితో పాక్ క్రికెటర్ మాటల యుద్ధం.. వీడియో వైరల్
పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్కు ఘోర పరాభవం ఎదురైంది. పేలవమైన ఆటతీరుతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో కొంతమంది పాకిస్థాన్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా యూఎస్లోనే ఉన్నారు. పేసర్ హారిస్ రవూఫ్ (Haris Rauf) కూడా అమెరికాలోనే ఉన్నాడు. రవూఫ్ తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని ఓ హోటల్ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది ఫ్యాన్స్ అతడిని సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడున్న వారిలో ఎవరు ఏమన్నారో తెలియదు కానీ రవూఫ్కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.
సహనం కోల్పోయిన హారిస్ రవూఫ్ భార్య వారిస్తున్న వినకుండా అక్కడున్న వారివైపు దూసుకొచ్చాడు. కొంతమంది ఆపడానికి ప్రయత్నించినా వినలేదు. ఓ వ్యక్తితో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అక్కడున్న వారు ఆపకపోతే దెబ్బలాడుకునేవారే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రవూఫ్ క్రికెటర్ అన్న విషయం మార్చిపోయి ఇలా వ్యవహరించడం తగదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కుటుంబం జోలికి వస్తే ఊరుకోను
అభిమానితో గొడవ జరిగిన ఘటనపై హారిస్ రవూఫ్ స్పందించాడు. ‘‘ఈ విషయం సోషల్ మీడియా వరకు రావొద్దని అనుకున్నా. కానీ, ఎలాగో వీడియో బయటకు రావడంతో స్పందించక తప్పడం లేదు. క్రీడాకారులుగా ఉన్నందున ప్రజల నుంచి అన్ని రకాల ఫీడ్ బ్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వారే కొన్నిసార్లు మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా. కానీ, హద్దులు దాటి నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి వస్తే వారికి తగ్గట్లుగా బదులిస్తాను. ప్రొఫెషన్స్కు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని రవూఫ్ ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.
రవూఫ్కు ఛైర్మన్ బాసట
‘‘హారిస్ రవూఫ్కు సంబంధించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఆటగాళ్లపై ఇటువంటి చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కావు. ఇలాంటి వాటిని మేం సహించబోము. ఈ విషయంతో ప్రమేయం ఉన్నవారు వెంటనే హారిస్ రవూఫ్కి క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసీన్ నక్వీ ఎక్స్లో పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్లో 43 పరుగులు!
ఒకే ఓవర్లో 43 పరుగులు సాధించి ఓ బ్యాటర్ రికార్డు సృష్టించాడు. -
ఇంగ్లాండ్తో సెమీస్.. మన బౌలింగ్కు ఎదురుందా..?
సెమీస్ పోరులో ఇంగ్లాండ్తో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. మన బౌలింగ్ దళం ఎంతో పటిష్ఠంగా కనిపిస్తోంది. -
ఈ ఒక్క గండం గట్టెక్కితే చాలు..!
టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గయానా వేదికగా గురువారం రాత్రి మ్యాచ్ జరగనుంది. -
ఎవరు గెలిచినా ఫస్ట్ టైమ్.. మరో సంచలనం చూస్తామా?
సంచలనాలకు వేదికగా టీ20 ప్రపంచ కప్ నిలిచింది. ఇప్పటి వరకు నాకౌట్ దశకు చేరుకోని అఫ్గాన్ తొలిసారి మెగా టోర్నీలో దూసుకొచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. -
అప్పటిలా కాదు.. ఈసారి టీమ్ఇండియాదే విజయం: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియానే ఫేవరేట్ అని పలువురు అంటున్నారు. -
మీ ఆంతర్యం ఏంటి..? బ్రాడ్కాస్టర్పై సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం!
టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్కు దూసుకుపోయింది. సూపర్-8 పోరులో ఆసీస్పై 24 పరుగుల తేడాతో విజయం సాధించడంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. -
కొత్త బాధ్యతల్లోకి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్..
భారత్కు తొలిసారి వన్డే ప్రపంచ కప్ను అందించిన కపిల్ దేవ్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. -
పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావంటూ ట్రోల్స్.. హర్భజన్ కౌంటర్
Harbhajan Singh: ‘పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావ్..’ అంటూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కు గట్టిగా సమాధానమిచ్చారు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. -
సూర్య కంటే 2 పాయింట్లే ఎక్కువ.. అగ్రస్థానంలోకి ఆస్ట్రేలియా ఓపెనర్
ఒక్క ఇన్నింగ్స్తో ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ అగ్రస్థానం సాధించాడు. గతేడాది డిసెంబర్ నుంచి ఆ స్థానంలో ఉన్న సూర్యకుమార్ కాస్త ఒక ర్యాంక్ కిందికి పడిపోయాడు. -
బాబ్బాబు.. 2500 డాలర్లు ఇవ్వండి వచ్చేస్తాం: ఈవెంట్లకు హాజరైన పాక్ ప్లేయర్లు
పాకిస్థాన్ క్రికెటర్లు చేసిన ఒక్కో విషయం తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్ కప్ కోసం కుటుంబాలను వెంట తీసుకెళ్లిన వారు.. ప్రత్యేకంగా ఈవెంట్లలోనూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
రోహిత్ ఆ ఒక్క ఇన్నింగ్స్తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్క్రిస్ట్
గత వన్డే ప్రపంచ కప్లో ఓటమికి ఈసారి ఆసీస్పై విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
పొట్టి ప్రపంచకప్లో సెమీస్ దశలో పలు నిబంధనలు మారాయి. ఒక జట్టుకు రిజర్వ్ డే లభించగా.. మరో జట్టుకు దక్కలేదు. అదే సమయంలో ఫలితం తేల్చే ఓవర్ల సంఖ్య కూడా మారింది. ఇవి టీమ్ ఇండియాకు లాభమా.. నష్టమా..? -
‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
అఫ్గానిస్థాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. -
అద్భుతవీరులు
ఏళ్లుగా వారి ఆట చూస్తున్నాం.. కొన్నిసార్లు వారి ప్రదర్శనకు ఆశ్చర్యపోయాం.. కొన్ని విజయాలకు అబ్బురపడ్డాం! కానీ ఈ టీ20 ప్రపంచకప్లో అఫ్ఘనుల ఆటను వర్ణించడానికి మాటల్లేవు..! -
అహో అఫ్గాన్
ఏం ప్రోత్సాహముందని! ఏం సౌకర్యాలున్నాయని! దేశమంతా అశాంతి.. బాంబుల మోత! ఎటు చూసినా హింసే. సాధారణ జీవనమే ఎంతో కష్టం. యుద్ధాలతో అతలాకుతలమైన ఆ దేశంలో కొన్నేళ్ల కింది వరకు సరదాగా అయినా వాళ్లు బ్యాట్లు పట్టుకోవడమే ఎక్కువ. -
సుహాస్.. ప్రపంచ నంబర్వన్
భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ ప్రపంచ నంబర్వన్ అయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అతను ఫ్రెంచ్ దిగ్గజం లూకాస్ మజుర్ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదించాడు. -
వార్నర్ ముగించేశాడు
అద్భుత కెరీర్కు అనుకోని ముగింపు! ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇక కనిపించడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్కు దూరమైన ఈ లెఫ్టార్మ్ డాషింగ్ ఓపెనర్.. వీడ్కోలు వందనాలు, అభిమానుల కేరింతలు లేకుండానే ఆస్ట్రేలియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. -
నాకౌట్స్లో ఇటలీ
ఇటలీ జట్టు యూరో ఛాంపియన్షిప్ నాకౌట్స్లో అడుగుపెట్టింది. క్రొయేషియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్ను ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. 55వ నిమిషంలో మోద్రిచ్ కొట్టిన గోల్తో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
పారిస్ ఒలింపిక్స్కు అనూష్
పారిస్ ఒలింపిక్స్లో భారత ఈక్వెస్ట్రియన్ ఆటగాడు అనూష్ అగర్వాలా బరిలో దిగనున్నాడు. భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య సెలెక్షన్ ట్రయల్స్లో శ్రుతి వోరాపై పైచేయి సాధించిన అనూష్కు ఒలింపిక్స్ బెర్తు దక్కింది. -
రేపు సెమీఫైనల్స్
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కృతిశెట్టి ‘పాజిటివ్ వైబ్స్’.. అనన్యా పాండే సెల్ఫీ
-
ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్లో 43 పరుగులు!
-
జమ్మూకశ్మీర్లో కాల్పులు .. ముగ్గురు ఉగ్రవాదులు హతం
-
నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పని చేస్తా: మోదీ
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?