Team India: వీరులారా.. వందనం

ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి.

Published : 05 Jul 2024 03:57 IST

సొంతగడ్డపై టీమ్‌ ఇండియాకు అపూర్వ స్వాగతం   

టు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. పూల వర్షం కురిసింది. నినాదాలు మిన్నంటాయి. ఇదీ టీ20 ప్రపంచకప్‌ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్‌ జట్టుకు లభించిన అఖండ స్వాగతం. తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్‌.. ప్రపంచకప్‌ను చూసి మురిసిపోయారు. బార్బడోస్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం దిల్లీలో దిగిన టీమ్‌ఇండియా.. తర్వాత ప్రధాని మోదీని కలిసింది. ఆపై ముంబయికి వెళ్లి మెరైన్‌ డ్రైవ్‌లో విజయయాత్రలో పాల్గొంది. వాంఖడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తమను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని