- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pak Cricket Team: మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
పాకిస్థాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్ అంటూ హంగామా చేసి పొట్టి కప్లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్మీ తరహా ట్రైనింగ్తో పాకిస్థాన్ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) కోసం సిద్ధమయ్యారు. ట్రెక్కింగ్ చేయడం, అడవుల్లో, నదుల్లో నడుస్తూ సాధన చేశారు. తీరా, పొట్టి కప్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టిన పాక్ తీవ్ర విమర్శలపాలైంది. యూఎస్ఏ, భారత్ చేతిలో పరాభవంతో ఆ జట్టు ప్లేయర్లపై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ మాత్రం ప్రదర్శనకు ఆర్మీ ట్రైనింగ్ అవసరమా? అంటూ కామెంట్లు వచ్చాయి. పొట్టి కప్ ఓటమి ప్రభావం నుంచి బయటకొచ్చిన పాక్ ప్లేయర్లు గడాఫీ స్టేడియంలో మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. అందులో పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పాత పరుపుల మీద డైవ్ చేస్తూ క్యాచ్లు అందుకోవడం కనిపించింది. దీంతో పాక్ మారలేదని.. వారి ట్రైనింగ్ హాస్యాస్పదంగా ఉందని కామెంట్లు వచ్చాయి.
‘‘బంతి ఎప్పుడైనా సరే.. ఇద్దరు ఫీల్డర్లకు దగ్గరగా మాత్రమే వెళ్లాలి. అప్పుడే మా క్రికెటర్లు బంతిని అందుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారు’’
‘‘పీసీబీ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో పాక్ ఆటగాళ్లు మరింత చులకన అవుతారు. పొట్టి కప్ ముందు కూడా ఇలాంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా మేనేజ్మెంట్లో ఎలాంటి మార్పు రాలేదు’’
‘‘హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో క్రికెట్ ధనిక క్రీడ. అలాంటిది ప్రొఫెషనల్స్ ఇలా పాత బెడ్లపై ప్రాక్టీస్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు. పాక్ ఆడే తరువాత మ్యాచులకు మైదానమంతా వీటితోనే నింపేస్తారేమో’’
‘‘ఇలా మ్యాట్రెస్ మీద దూకడం కంటే.. మైదానంలోని గడ్డి మీద డైవ్ చేయడం బెటర్. ఇలా అయితే క్రికెట్లో మళ్లీ సక్సెస్ కావడం కష్టమే’’
రిజ్వాన్పై షహజాద్ తీవ్ర వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి రిజ్వాన్ అసందర్భ వ్యాఖ్యలు చేశాడని పాక్ వెటరన్ ఆటగాడు షహజాద్ విమర్శించాడు. ‘‘కొందరు టీ20 ప్రపంచకప్లో దారుణ ప్రదర్శన చేశారు. అయితే, వారి ఆటను కప్పి పుచ్చుకోవడానికి ఇతర విషయాలను బయటకు తీసుకురావడం సరైంది కాదు. ఫిట్గా లేకుండా మైదానంలోకి దిగితే ఎలా ఆడగలరు? దీనికి కూడా కారణాలు వెతికితే వారిని ఏమనాలి?’’ అని షెహజాద్ ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహకులు భారత్కు అనుకూలంగా వ్యవహరించారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. -
ఫైనల్ మ్యాచ్ వేదికపై ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలు.. బదులిచ్చిన బీసీసీఐ
భారత్లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్ మ్యాచ్లకు ముంబయి వేదిక కావాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కోరడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. -
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. -
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్లోనూ తాను ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
పునర్వినియోగం కాని వస్తువులను ప్రోత్సహించొద్దు: డిప్యూటీ సీఎం పవన్
-
5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
బ్లూ లైన్లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన
-
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
-
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..