- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SA vs AFG: ఎవరు గెలిచినా ఫస్ట్ టైమ్.. మరో సంచలనం చూస్తామా?
సంచలనాలకు వేదికగా టీ20 ప్రపంచ కప్ నిలిచింది. ఇప్పటి వరకు నాకౌట్ దశకు చేరుకోని అఫ్గాన్ తొలిసారి మెగా టోర్నీలో దూసుకొచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: సంచలన ప్రదర్శనతో హేమాహేమీలను కాదని అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీస్కు చేరింది. మరోవైపు దూకుడైన ఆటతీరుతో నాకౌట్కు వచ్చిన జట్టు దక్షిణాఫ్రికా. రెండు టీమ్ల మధ్య టీ20 ప్రపంచ కప్ తొలి సెమీస్ జరగనుంది. ఇందుకు వేదిక ట్రినిడాడ్. బలాలను బేరీజు వేసుకుంటే సౌతాఫ్రికాదే ఆధిపత్యం. కానీ, అఫ్గాన్ను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో ఇప్పటికే నిరూపణ అయింది.
ఎవరు కీలకం..?
- దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య గురువారం ఉదయం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తొలి సెమీస్ ప్రారంభం కానుంది. ట్రినిడాడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
- ఇప్పటి వరకు ఇరు జట్లూ టీ20ల్లో రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. అన్నింట్లోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఇప్పుడు తొలి గెలుపుపై అఫ్గాన్ కన్నేసింది.
- టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అఫ్గాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (281) ముందున్నాడు. ఇబ్రహీం జద్రాన్ (229) కూడా మూడో స్థానంలో నిలిచాడు.
- ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ కూడా అఫ్గాన్కు చెందిన వారే కావడం గమనార్హం. ఫరూఖి 16 వికెట్లు ముందున్నాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (14), నవీనుల్ హక్ (13) ప్రభావం చూపించారు.
- లీగ్స్టేజ్, సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా అజేయంగా నిలిచి సెమీస్కు దూసుకొచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ మార్క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డికాక్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో రబాడ, షంసీ, ఎన్సెన్, కేశవ్ మహరాజ్, బార్ట్మన్ అదరగొట్టేస్తున్నారు.
- అఫ్గాన్ మాత్రం సంచలన విజయాలు సాధించింది. న్యూజిలాండ్, ఆసీస్ను చిత్తు చేసి మొదటి సారి నాకౌట్కు చేరింది. గుర్బాజ్, జద్రాన్, ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు. రషీద్ ఖాన్, నూర్, నవీనుల్, ఫరూఖి దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తిపోతున్నారు.
- దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లలో ఎవరు సెమీస్లో గెలిచి ఫైనల్కు చేరినా.. వారికిదే మొదటిది కావడం విశేషం. ఇప్పటి వరకు ఇరు జట్లూ పొట్టి కప్లో ఒక్కసారి కూడా ఫైనల్కు చేరలేదు.
- ట్రినిడాడ్ పిచ్ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని అంచనా. ఈ పిచ్పై తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 135. రెండో ఇన్నింగ్స్లో 122 పరుగులుగా ఉంది.
- మ్యాచ్కు వర్షం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ వరుణుడు మ్యాచ్ను అడ్డుకుంటే మాత్రం అఫ్గాన్కు చుక్కెదురైనట్లే. మ్యాచ్ రద్దైతే దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్కు చేరుతుంది. సూపర్-8 స్టేజ్లో అగ్రస్థానంలో ఉండటమే దానికి కారణం.
- టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి స్కోరును లక్ష్యంగా నిర్దేశిస్తే.. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడం ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అఫ్గాన్ తన నాలుగు మ్యాచ్లను ఇలానే గెలిచింది.
తుది జట్లు (అంచనా)
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఐదెన్ మార్క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో ఎన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నోకియా, షంసీ
అఫ్గానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, కరీమ్ జనత్, ఖరోటె, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫీల్డింగ్ మెడల్ ఎవరికి?ఎవరిచ్చారంటే?
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో బెస్ట్ ఫీల్డింగ్ అవార్డును ఈసారి టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అందించాడు. -
తొలి రోజు ఆట పూర్తి.. భారత మహిళల రికార్డు స్కోరు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా తొలిరోజు ఆటముగిసింది. భారత్ మహిళా జట్టు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. -
ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్డే నాడూ మ్యాచ్ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్..?
ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. -
నమ్మడం.. నడిపించడం.. ఇదే రోహిత్ మార్క్ కెప్టెన్సీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. -
భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?
టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్-8, సెమీస్లను దాటేసి ఫైనల్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. -
వారెవ్వా.. అదిరిపోయే ధోనీ న్యూ లుక్ చూశారా?
MS dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ న్యూ హెయిర్స్టైల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘ఒకరి కోసం కప్ గెలవాలి’.. నేను ఇలాంటివి అస్సలు నమ్మను: ద్రవిడ్
టీ20 ప్రపంచకప్లో రెండోసారి విజేతగా నిలవాలని టీమ్ఇండియా ఎదురుచూస్తోంది. ఇప్పుడా అవకాశం వచ్చింది. పొట్టి కప్ 2024లో ఫైనల్కు చేరింది. -
దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు దూకుడుగా ఆడుతోంది. -
భారత్ విజయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అక్కసు.. పిచ్పై ప్రేలాపనలు..!
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెన్ వాన్ గయాన పిచ్పై చేసిన ప్రేలాపనలకు భారత సీనియర్, మాజీ ఆటగాళ్లు బలంగా కౌంటర్ ఇచ్చారు. -
రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్గా రికార్డు
సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్ ఫైనల్కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్తో రాణించాడు. -
బ్యాటర్ల దూకుడు.. బౌలర్ల విజృంభణ.. భారత్ విజయం.. ఇవిగో వీడియోలు!
ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో టీమ్ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఇక ఫీల్డింగ్లోనూ మెరుపులతో అదరగొట్టేశారు. -
ఆ ఒక్క ట్రిక్ పాటించా.. వికెట్లు సాధించా: అక్షర్ పటేల్
భారత విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ముగ్గురు డేంజరస్ బ్యాటర్లు బట్లర్, బెయిర్స్టో, మొయిన్ అలీ వికెట్లు పడగొట్టాడు. -
రోహిత్ శర్మ భావోద్వేగం.. ‘కమాన్ మ్యాన్ చీర్స్’ అన్న విరాట్ కోహ్లీ!
టీమ్ఇండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. అయితే, సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన తర్వాత రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. -
కోహ్లీకి ఫామ్ సమస్యే కాదు.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు: రోహిత్ శర్మ
ఇంగ్లాండ్పై ఘన విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
వావ్ రిషభ్ పంత్.. సూపర్ స్టంపింగ్.. వీడియో వైరల్
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేశాడు.
-
రోహిత్ హిట్టింగ్.. అక్షర్ టర్నింగ్.. మ్యాచ్ హైలైట్స్ అదుర్స్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు టీమ్ఇండియా దూసుకుపోయింది. సెమీస్లో ఇంగ్లాండ్ను అలవోకగా చిత్తు చేసి మూడోసారి టైటిల్ రేసులో నిలిచింది.
-
దెబ్బకు దెబ్బ
గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్! ఇంగ్లాండ్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్ జట్టు. -
ఎన్నాళ్లో వేచిన విజయం
ఓ అద్భుత ప్రస్థానానికి అనుకోని ముగింపు. పాపం.. అఫ్గానిస్థాన్! సంచలన ప్రదర్శనతో, పోరాటపటిమతో అంచనాలను అమాంతం పెంచేసి క్రికెట్ ప్రపంచం దృష్టినంతా తనవైపే తిప్పేసుకున్న ఈ జట్టు.. సెమీఫైనల్లో చతికిల పడింది. -
పోర్చుగల్కు షాక్.. నాకౌట్కు జార్జియా
యూరో కప్లో సంచలనం. గురువారం గ్రూప్- ఎఫ్ మ్యాచ్లో అగ్రశ్రేణి జట్టు పోర్చుగల్కు షాకిచ్చిన జార్జియా నాకౌట్కు అర్హత సాధించింది. 2-0 తేడాతో రొనాల్డో జట్టుపై జార్జియా నెగ్గింది. ఇప్పటికే పోర్చుగల్ రౌండ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
కౌంటీల్లో రహానె
టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె మరోసారి ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ సీజన్ కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లీసెస్టర్షైర్ క్లబ్ గురువారం ప్రకటించింది. -
జోరు కొనసాగిస్తారా!
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం సఫారీలతో ఆరంభమయ్యే ఏకైక టెస్టులోనూ అదరగొట్టాలని హర్మన్ప్రీత్ బృందం బరిలో దిగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పీజీ చేసిన ఉద్యోగికి.. లీవ్లెటర్ రాయడం రాకుంటే ఎలా? - సుప్రీం కోర్టు
-
రకుల్ప్రీత్ సింగ్ ‘వర్కౌట్స్’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!
-
పార్టీని వీడే వారి గురించి ఆలోచించొద్దు: కేసీఆర్
-
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్
-
ఏసీబీ డీజీగా అతుల్ సింగ్.. ఏపీలో పలువురు IPSల బదిలీ
-
5-స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన మహిళ.. వీడియో వైరల్