- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit Sharma: రోహిత్ ఆ ఒక్క ఇన్నింగ్స్తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్క్రిస్ట్
గత వన్డే ప్రపంచ కప్లో ఓటమికి ఈసారి ఆసీస్పై విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) భారత్ సెమీస్కు చేరుకుంది. సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్ఇండియా అగ్రస్థానం సాధించి మరీ నాకౌట్కు వెళ్లింది. అప్పటి వరకు భారీ ఇన్నింగ్స్లు ఆడని కెప్టెన్ రోహిత్ ఆసీస్పై మాత్రం విరుచుకుపడ్డాడు. ఓ వైపు విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయినా సరే.. కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్ వంటి బౌలర్లపై దూకుడుగా ఆడటం అభినందనీయమని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తెలిపాడు. ఇలాంటి ఆటతీరుతో చాలామంది నోళ్లు మూయించాడని వ్యాఖ్యానించాడు.
‘‘రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా అద్భుతంగా ఆడాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను... మైదానంలో చేసి చూపించాడు. యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు. ఐపీఎల్ గణాంకాలను చూసి చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం ఇచ్చినట్లైంది. జట్టులో తన విలువేంటో చాటిచెప్పాడు. బౌలర్లపై ఎప్పుడు ఆధిపత్యం ప్రదర్శించాలో బాగా తెలిసిన క్రికెటర్. కెప్టెన్ ముందుండి ఇలాంటి ఆటతీరును ప్రదర్శిస్తే.. జట్టులోని మిగతా సహచరులూ స్ఫూర్తి పొందుతారు. మ్యాచ్ సమయంలో చాలామంది కెప్టెన్లు ‘ఫలితాల గురించి ఆలోచించం.. ఆడే విధానంపై దృష్టిపెడతాం’ అంటుంటారు. ఇక్కడ రోహిత్ మాత్రం దూకుడుగానే తన ఇన్నింగ్స్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు’’ అని గిల్క్రిస్ట్ తెలిపాడు.
ఇలా జరిగితే.. ఆ జట్టుదే వరల్డ్ కప్: హాగ్
టీ20 ప్రపంచకప్లో భారత్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్కు చేరాయి. తొలి సెమీస్ దక్షిణాఫ్రికా-అఫ్గాన్ (SA vs AFG)ల మధ్య గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ అదేరోజు రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లాండ్ (IND vs ENG)మధ్య జరగనుంది. అయితే, అఫ్గాన్పై దక్షిణాఫ్రికా విజయం సాధించి ఫైనల్కు చేరితే మాత్రం ఆ జట్టే టైటిల్ సొంతం చేసుకుంటుందని మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. ‘‘దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్, క్లాసెన్, డికాక్, మిల్లర్ మంచి ఫామ్లో ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా కీలక ఇన్నింగ్స్తో రాణిస్తున్నాడు. బౌలర్లలో షంసీను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టం. అతడికి తోడుగా కేశవ్ మహరాజ్ ఉన్నాడు. ఇక పేస్ అద్భుతంగా ఉంది’’ అని బ్రాడ్ హాగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
-
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు