- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Indian T20: రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ ఇండియా టీ20 (Team India T20) ప్రపంచకప్ ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో సారథి రోహిత్ సైలెంట్గా ఈ ఫార్మాట్కు గుడ్బై చెప్పేశాడు. హిట్మ్యాన్ ఫోకస్ ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీపై ఉంది. ఇక టీ20పై కొత్తవారు దృష్టి పెట్టి వారసత్వాన్ని అందుకోవాలని భావించాడు. వాస్తవానికి హిట్మ్యాన్ టీమ్ ఇండియాకు ఈ ఫార్మాట్లో కొత్త ప్రమాణాలు సృష్టించాడు. అతడి వారసుడు ఇప్పుడు వాటిని కచ్చితంగా ముందుకుతీసుకెళ్లగలిగే స్థాయిలో ఉండాల్సిందే. భారత్ పొట్టిఫార్మాట్లో దాదాపు దుర్భేద్యమైన జట్టుగా మారింది. ఈనేపథ్యంలో జట్టు పగ్గాలను బీసీసీఐ, సెలక్టర్లు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ రేసులో పలువురు స్టార్లు ఉన్నారు.
వైస్ కెప్టెన్ ముందంజ..
ఈ రేసులో ప్రస్తుత జట్టు వైస్కెప్టెన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో అతడి ఆటతీరు ఫ్యాన్స్ను ఖుష్ చేసింది. ముఖ్యంగా ఫైనల్స్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానే ముందుండి ఎదురుదాడికి దిగాడు. ఎంతో రిస్క్తో కూడిన చివరి ఓవర్ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి.. తాను ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని నిలబడతానని ప్రపంచానికి చెప్పాడు.
ఈ ఫార్మాట్లో 2022 ఐపీఎల్ను గుజరాత్ టైటాన్స్కు సాధించిన అనుభవం పాండ్యాకు ఉంది. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి 2022 టీ20 కప్పులో భారత్ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ జరిగింది. దానికి పాండ్యానే నాయకత్వం వహించి గెలిపించాడు. ఆ తర్వాత శ్రీలంకపై (3-0), స్వదేశంలో కీవిస్పై (2-1) సిరీస్ల్లో విజయపథంలో నడిపించాడు. గతేడాది చివరిసారిగా వెస్టిండీస్లో జరిగిన ద్వైపాక్షిక టోర్నీని 3-2 తేడాతో ఓడిపోయాడు.
జట్టుకు హార్దిక్పాండ్య స్థాయి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటివరకు లభించలేదు. దీంతో అతడి పాత్ర కీలకంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్పై పట్టు ఉండటం అతడికి కలిసొచ్చే అంశం. కాకపోతే, తరచూ గాయాలపాలవుతాడనే అపవాది ఉంది. కొన్ని సీజన్లలో తన కోటా ఓవర్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దీంతోపాటు వన్డేల్లో కూడా అతడు ఆల్రౌండర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.
సూర్యకు బ్యాటింగే బలం..
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా నాయకత్వ రేసులో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని ఆటగాడు. తాను ఐదు ఓవర్లు క్రీజులో ఉంటే చాలు.. ఏ జట్టు నుంచైనా విజయాన్ని లాగేసుకొంటాడు. ఇటీవల కాలంలో భారత జట్టులో దూకుడు బ్యాటింగ్ పెరగడంలో సూర్య ప్రభావం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు భారత్ పర్యటించిన వేళ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. మొత్తం ఏడు మ్యాచ్లకు నాయకత్వం వహించి ఐదు గెలిపించాడు. తన చివరి మ్యాచ్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై 56 బంతుల్లో శతకం చేశాడు. అదే మ్యాచ్ను 106 పరుగుల తేడాతో విజయం సాధించాడు.
బౌలింగ్ జీనియస్ బుమ్రా..
కెప్టెన్ రేసులో వినిపిస్తున్న మరో పేరు బుమ్రా. ఈ బౌలింగ్ మెషిన్ ప్రపంచకప్లో బ్యాటర్లను వణికించింది. మూడు ఫార్మాట్లలో ఇతడు ఆడుతున్నాడు. బ్యాటర్ల బలహీనతలు గమనించి.. తగినట్లుగా బౌలింగ్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇతడికి నాయకత్వ అనుభవం చాలా తక్కువ. గతంలో వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. మంచి వ్యూహ చతురత, గేమ్ అవేర్నెస్ అతడికి ఎక్కువ. గాయం నుంచి కోలుకొని వచ్చాక.. భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు నాయకత్వం వహించి గెలిపించాడు. మూడు ఫార్మాట్లలో కీలక బౌలర్ కావడం, గాయాల భయం కారణంగా అతడికి నాయకత్వ పగ్గాలు అప్పగించేందుకు సెలక్టర్లు సంకోచించవచ్చు. దీనికితోడు కెప్టెన్సీ అదనపు భారంగా మారి అతడి లయను దెబ్బతీస్తాయన్న భయాలూ ఉన్నాయి.
ఇప్పటికే రేసులో గిల్..
తాజాగా జింబాబ్వేతో పొట్టి సిరీస్కు స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ పగ్గాలు అందుకొన్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఫలితం అతడి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఫార్మాట్లో గుజరాత్ లీగ్ జట్టుకు ఇప్పటికే నాయకత్వం వహిస్తున్నాడు. కానీ, ఈసారి ప్రపంచకప్ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. ఇప్పుడు రోహిత్-కోహ్లీ ఏకకాలంలో ఈ ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో జట్టులో గిల్ స్థానం దాదాపు ఖాయమైంది. ఇక వన్డేల్లో ఇప్పటికే కీలక బ్యాటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
పోటీలో పంత్ కూడా..
యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరు కూడా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోవచ్చు. గాయం తర్వాత మళ్లీ మంచి దూకుడుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వికెట్ల వెనక ఉంటూ బ్యాటర్ల బలహీనతలు, పిచ్ మార్పులను వేగంగా అంచనా వేయగల సత్తా అతడికి ఉంది. గతంలో లెజెండ్ కెప్టెన్ ధోనీ కూడా ఇవే స్కిల్స్తో జట్టును విజయపథంలో నడిపించిన సంగతి తెలిసిందే. 2024లో తాను బ్యాటింగ్లో రాణిస్తూనే దిల్లీ లీగ్ జట్టును నడిపించాడు. 2022లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమ్ ఇండియా 2-2తో డ్రా చేసుకొంది. జట్టులో వికెట్ కీపర్ రోల్కు విపరీతమైన పోటీ ఉండటం పంత్కు నెగిటివ్ పాయింట్. సంజూ, ఇషాన్ కిషన్, రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వారితో పోటీపడాలి. దీంతో టీమ్ లెవన్లో అతడు స్థానం సుస్థిరం చేసుకోవాల్సి ఉంది.
వీరిలో చాలామందికి ఇప్పటికిప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోయినా.. భవిష్యత్తు కోసం సిద్ధం చేయవచ్చు. ఇక కొత్త కెప్టెన్కు డిప్యూటీ పోస్టు కూడా జట్టులో భర్తీ చేయాల్సివస్తే.. వీరిలో ఒకరికి అవకాశం రావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. -
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు. -
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో వైకాపా నేతల అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
-
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
-
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష