- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 WC 2024-Rohit Sharma: 2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: రెండోసారి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024)ను అందుకొన్న ఏకైక భారత క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. మొదట 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచిన జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి కెప్టెన్సీలోనే టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. కప్తో స్వదేశానికి వచ్చిన ప్లేయర్లు ముంబయిలో రోడ్షో నిర్వహించారు. అనంతరం వారికి వాంఖడే వేదికగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ (Rohit Sharma) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘‘2007లో భారత్ తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. అప్పుడు కూడా ఇలాంటి విజయోత్సవం జరిగింది. ఇప్పుడు కూడా అభిమానులు భారీగా హాజరై మమ్మల్ని అభినందించడం ఆనందంగా ఉంది. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో విజేతగా నిలవడం ఎప్పటికీ మరిచిపోలేను. అయితే, ఈసారి కప్ను సాధించడం మాత్రం మరింతో స్పెషల్. జట్టుకు నాయకత్వం వహించా. దేశం గర్వపడేలా చేశామని భావిస్తున్నా’’ అని తెలిపాడు.
చిన్ననాటి స్నేహితుల నుంచి గ్రాండ్ సెల్యూట్
ముంబయికి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు అతడి చిన్ననాటి స్నేహితుల నుంచి అనూహ్య అనుభవం ఎదురైంది. వారందరూ కలిసి రోహిత్ సెల్యూట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ స్నేహితులతోపాటు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ కూడా సెల్యూట్ చేసి ఆశ్చర్యపరిచాడు. టైటిల్ను అందుకొనే సమయంలో రోహిత్ ‘రిక్’ స్టైల్లో చేసిన వాక్ గుర్తుంది కదా.. ఇప్పుడు తమ స్నేహితుడిని కలిసేందుకు ఇలాంటి స్టైల్లోనే వారంతా వెళ్లడం గమనార్హం.
నా మనస్సు నిండిపోయింది: అశ్విన్
భారత క్రికెటర్ల (Team India) విజయోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. వీటిపై సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘‘అభిమానులు సందడి, క్రికెటర్ల జోష్ వీడియోలు, ఫొటోలను చూస్తే నా మనస్సు నిండిపోయింది. క్రీడల పట్ల దేశం చూపే అభిమానం ఉన్నతంగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఛాంపియన్స్ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని అశ్విన్ పోస్టు పెట్టాడు.
ముంబయి పోలీసులకు కోహ్లీ థాంక్స్
ముంబయిలో రోడ్షోను విజయవంతం కావడంలో పోలీసుల కృషి మరువలేనిదని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. ‘‘టీమ్ఇండియా విక్టరీ పరేడ్ను సక్సెస్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. మీ నిబద్ధత, సేవలకు హృదయపూర్వక అభినందనలు. జైహింద్’’ అని విరాట్ ఎక్స్లో పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
జీవితం ఎంతో విలువైంది.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దు: పీవీ సింధు
జీవితం ఎంతో విలువైందని.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దని ప్రముఖ బ్యామ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సూచించారు.
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
ఆరు నెలలుగా చాలా కుంగుబాటుకు గురైనట్లు ఇషాన్ కిషన్ వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఉద్వాసన మొదలు జాతీయ జట్టులో చోటు కోల్పోవడం వరకు ప్రతిదీ బాధపెట్టిందని తెలిపాడు. -
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో రోహిత్తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. -
భారత కోచ్గా గంభీర్! ఈడెన్ గార్డెన్స్లో ఫేర్వెల్ వీడియో షూట్
టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. -
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’