Andhra news: మా పార్టీ కార్యాలయాలు కూల్చేయబోతున్నారు: హైకోర్టులో వైకాపా పిటిషన్‌

రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ ఏపీ హైకోర్టులో వైకాపా నేతలు లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 

Published : 26 Jun 2024 19:10 IST

అమరావతి: రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ ఏపీ హైకోర్టులో వైకాపా నేతలు లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీంతో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్‌ కో పాటించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని