- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
YS Jagan: పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు.
అన్యాయం జరుగుతోందనే ఈవీఎంను పగలగొట్టారు
చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది
తెదేపా కార్యకర్తలపైనా చర్యలు ఉంటాయ్
నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి.. మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్
నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద మాట్లాడుతున్న జగన్. పక్కన మాజీ మంత్రులు కాకాణి, అంబటి, అనిల్కుమార్ యాదవ్ తదితరులు
ఈనాడు, అమరావతి, నెల్లూరు, నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్టుడే: ‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో అన్యాయం జరుగుతోందనే ఆయన వెళ్లి ఈవీఎంను పగలగొట్టారు’ అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ తేల్చేశారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం జగన్. పరామర్శించారు. తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు.
‘పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీలను ఓటు వేయనివ్వడం లేదని.. అన్యాయం చేస్తున్నారని, వారికి అండగా నిలిచేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు. ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు. అన్యాయం జరుగుతోందనే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారు. పిన్నెల్లికి అక్కడ అంతా బాగా ఉంటే, ఆయనే రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే ఈవీఎంను ఎందుకు పగలగొడతారు? ఆయనకు అక్కడ బాగోలేదు కాబట్టే పగలగొట్టారు. అక్కడ అన్యాయం జరుగుతున్నందున ఈవీఎంను ధ్వంసం చేశారని గుర్తించినందువల్లే పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. మరోవైపు కారంపూడిలో 14న ఘటన జరిగితే 23న పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు మోపారు. ఘటన జరిగిన ప్రాంతంలో పిన్నెల్లికి సీఐ నారాయణస్వామి కనీసం ఎదురుపడలేదు..అయినా కేసు పెట్టారు. ఎన్నికల సంఘం వేసిన సిట్ పల్నాడులో పర్యటించి సమర్పించిన నివేదికలో ఈ హత్యాయత్నం అంశం ప్రస్తావనే లేదు’ అని వ్యాఖ్యానించారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి బయటకు వస్తున్న జగన్
మీ గ్రామాల్లో.. మీ కార్యకర్తలపై ఇదే తరహాలోనే
‘దొంగ కేసులు పెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబూ ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు.. ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇలా తప్పుడు రాజకీయాలు కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలికినట్లే. ఈ రోజు మీరు వేసే ఈ బీజం రేపు చెట్టవుతుంది.. మీ గ్రామాల్లో, మీ కార్యకర్తలకు ఇదే మాదిరి కార్యక్రమాలే జరుగుతాయి. దీనికి కచ్చితంగా ఫుల్స్టాప్ పెట్టమని చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం. ఇదే మాదిరి జరిగితే ఊరుకునేది లేదు. ప్రతిస్పందన (రియాక్షన్) అనేది కచ్చితంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం’ అని జగన్ అన్నారు.
అందువల్లే ఓడాం
‘ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైకాపా ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో, కూస్తో ఇదై ఆ పదిశాతం ఓట్లు అటువైపు మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు’ అని అన్నారు.చివరిలో విలేకరులు ప్రశ్నలు అడగబోగా తాను చదివిన స్క్రిప్టు కాగితాలు చూపిస్తూ..చాల్లే ఇది సరిపోతుంది..ఇంకెందుకు అంటూ జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పిన్నెల్లితో 25 నిమిషాల పాటు జగన్ ములాఖత్
మాజీ సీఎం జగన్ గురువారం మధ్యాహ్నం నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయ్యారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కనుపర్తిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. 12.15 గంటలకు జైలులోకి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి ఉన్నారు. సుమారు 25 నిమిషాల పాటు పిన్నెల్లితో మాట్లాడారు. 12.40 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు బయట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.. ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదుచేశారు. -
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం
విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు పేర్కొన్నారు. -
తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్
సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు
పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. -
తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి
వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. -
వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. -
ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. -
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే
భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభుత్వ సలహాదారుగా కేకే
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్ ఎఫైర్స్) సలహాదారుగా ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. -
రేపు విజయవాడకు సీఎం రేవంత్రెడ్డి
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ
కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ
నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... -
అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్లో చేరండన్న మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలవడం చర్చనీయాంశమైంది. -
పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. -
గుజరాత్లో భాజపాను ఓడిస్తాం
ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చెప్పారు. -
అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలు
సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!