- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్.. ఈ నియామకాల్లో కీలక భూమిక
Rahul gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ నియమితులయ్యారు. దీంతో ఆయనకు కొన్ని అధికారాలు, సౌకర్యాలు దక్కనున్నాయి.
Rahul gandhi | దిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.
2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండు దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది. వాస్తవానికి 1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు, హోదా దక్కనున్నాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, జడ్+ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్ బిల్డింగ్లో ఆయనకో కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.
జీరో FIR, ఆన్లైన్ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు
నియామకాల్లో..
ప్రతిపక్ష నేతగా కొన్ని నియామకాల విషయంలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీలో రాహుల్ గాంధీ ఒకరిగా ఉంటారు. ప్రధాని, కేంద్రమంత్రి ఇతర సభ్యులుగా ఉంటారు. అలాగే, సీబీఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలకు అధిపతులను నియమించే కమిటీలోనూ రాహుల్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. దీంతోపాటు ప్రతిపక్ష నేతగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్, కొన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు.
తండ్రి, తల్లి తర్వాత..
1989 డిసెంబరు 18 నుంచి 1990 డిసెంబరు 23 వరకూ రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన ప్రత్యేక రికార్డు రాహుల్ గాంధీతోపాటు, ఆయన తండ్రి, తల్లికి దక్కినట్లయింది. 7, 8 లోక్సభలతో పాటు, 16, 17 లోక్సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలెవరూ లేరు. ఇప్పుడు 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారు. 1970 జూన్ 19న జన్మించిన రాహుల్ గాంధీ 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009, 2014లలో అమేఠీ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2019లో అమేఠీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేఠీలో ఓడిపోయి వయనాడ్లో గెలిచారు. 2024లో రాయ్బరేలీ, వయనాడ్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. వయనాడ్కు రాజీనామా చేసి ప్రస్తుతం తన తాత, నానమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
వచ్చే వారంలో కొలిక్కి!
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.