Bhatti vikramarka: ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 03 Jul 2024 18:53 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన భారాస నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని  ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. రైతు భరోసా మొత్తంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృథాగా పోకూడదనే ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. 

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని భట్టి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని