KTR: చిన్నచిన్న పొరపాట్లు చేశాం.. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు.
ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ మూణ్నెల్లలో తేల్చాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్
ఈనాడు, దిల్లీ: ‘‘తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు. పదేళ్లలో ప్రభుత్వపరంగా ఏ కొలమానంలో చూసినా మేం టాప్లో ఉన్నాం. ఆ విషయంలో మమ్మల్ని ఢీకొనలేక.. అహంకారం అని, అందుబాటులో ఉండరని ప్రచారం సృష్టించారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాలుగు రోజులుగా దిల్లీలో ఉన్న ఆయన మంగళవారం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెరాస పేరును భారాసగా మార్చడం వల్ల నష్టం వచ్చిందని తాను భావించడం లేదన్నారు.
తొత్తుల్ని పైన కూర్చోబెట్టి ఎత్తులు
‘‘తెలంగాణలో నాయకత్వం బలంగా ఉండటం ఇష్టం లేనివారు కేసీఆర్, కేటీఆర్లకు అహంకారం అని ప్రచారం చేశారు. కేసీఆర్ ఎవరికీ లొంగని వ్యక్తి కనుక.. ఆయన్ను తొక్కడానికి తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారు. మేం అహంకారం చూపెట్టి ఉంటే యూట్యూబ్లో మాపై అడ్డగోలు ప్రచారం చేసిన, దుర్భాషలాడిన వాళ్లను వదిలిపెట్టేవాళ్లమా? హైదరాబాద్, తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారమా? ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియకపోతే ఎలా?
ప్రజల తప్పు లేదు...
మా ఓటమికి మూడు, నాలుగు కారణాలున్నాయి. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా అంటే.. ఏపీలో జగన్ చాలామంది అభ్యర్థులను మార్చారు. అయినా వైకాపా ఓడిపోయిందిగా! ఎన్నికల్లో గెలవడానికి ఒక్క సూత్రం అంటూ ఉండదు. అది తెలిసి ఉంటే ప్రశాంత్కిశోర్ లాంటి వారి హవా నడుస్తుండేది. కొన్ని విషయాల్లో చిన్నచిన్న పొరపాట్లు చేశాం. ఇందులో ప్రజల తప్పు లేదు. మాకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదు. కొన్ని విషయాల్లో మా వైఖరి మార్చుకొని ఉండాలన్నది 100% నిజం.
మాకు, వాళ్లకు 21 సీట్లే తేడా
మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చాయి. మాకు, కాంగ్రెస్కు మధ్య కేవలం 4 లక్షల ఓట్లు, 21 సీట్లు మాత్రమే వ్యత్యాసం. ఎన్నో విషయాల్లో విజయాలు సాధించినా ప్రజా సంబంధాల విషయంలో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది. మేం చేసినదాన్ని సరిగా ప్రచారం చేసుకోలేకపోయాం. నా ధోరణి (యాటిట్యూడ్) 2014లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అప్పట్లో అదే గెలిపించింది. 2023లో ఎందుకో సాధ్యం కాలేదు.
ఇప్పటికీ కేసీఆరే పెద్ద నాయకుడు
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇప్పటికీ తెలంగాణలో కేసీఆరే పెద్ద నాయకుడు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు కిందపడ్డాం. దులుపుకొని లేచి మళ్లీ పరుగెత్తాలి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను కాకుండా మోదీని చూసి ఓటేశారు. అందువల్లే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినవారు కూడా ఎంపీలుగా గెలిచారు.
అంశాలవారీగా మద్దతు
రాజ్యసభలో కేంద్రానికి అంశాలవారీగా మద్దతిస్తాం. ఇప్పటివరకు అదే పద్ధతి అనుసరిస్తూ వచ్చాం. ఇకముందూ అలాగే ఉంటాం. కాంగ్రెస్ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ బిల్లులకు మద్దతు పలికింది. అంతమాత్రాన ఆ రెండు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయని చెప్పలేం. భాజపా-భారాస కుమ్మక్కయ్యాయన్న ఆరోపణల్లో నిజం లేదు.
ఏపీలో ఆశ్చర్యకరంగా ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మా అవగాహనకు అతీతంగా జరిగాయి. పేదలకు జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలుచేశారు కాబట్టి ఆయన వైపు మొగ్గు ఉంటుందని మాకు రిపోర్ట్ వచ్చింది. అదే మేం చెప్పాం. కానీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపు అయింది. పవన్కల్యాణ్, భాజపా, తెదేపాలు వేర్వేరుగా పోటీచేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో! నా మిత్రుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉండేవారు. అయినా ఓడిపోయారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానిక్కూడా వీల్లేదు. ఎన్నికల ఫలితాలకు.. అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైంది.
రెండు రాష్ట్రాలకు చంద్రబాబు ఎక్కువ నిధులు తేవాలి
అయిదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందన్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ గెలిచారు. దిల్లీలో ఎక్కడచూసినా ఆయన పోస్టర్లే కనిపిస్తున్నాయి. చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య సమావేశాన్ని ముఖ్యమంత్రుల మధ్య జరిగిందిగానే చూడాలి. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నాం. తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తాం. మేం ఆంధ్రాలో భారాసను పెట్టినప్పుడు తెలంగాణలో తెదేపాను బలోపేతం చేస్తామని ఆయన చెప్పడంలో తప్పులేదు’’ అని కేటీఆర్ వివరించారు.
కూటముల్లో లేనివారు ఓడిపోయారు
లోక్సభ ఎన్నికలు మోదీ, యాంటీ మోదీ విధానంలో జరిగాయి. ఆయనకు మద్దతు పలికేవారు ఎన్డీయేలో, వ్యతిరేకించేవారు ఇండియా కూటమిలో చేరిపోయారు. ఈ రెండు కూటముల్లో లేనివారు ఓడిపోయారు. కేరళలో సీపీఎం ఇండియా కూటమిలో లేకపోవడం వల్ల ఒక్క సీటుకే పరిమితమైంది. తమిళనాడులో ఆ కూటమిలో చేరడంవల్ల 2 సీట్లు గెలుచుకొంది. ఏ కూటమిలో లేని కారణంగా ఏపీలో వైకాపా, తెలంగాణలో భారాస, ఒడిశాలో బిజద, ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ, పంజాబ్లో అకాలీదళ్ దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్వీయూ పీఎస్కు చెవిరెడ్డి మోహిత్రెడ్డి తరలింపు
వైకాపా నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఎస్వీయూ పోలీస్స్టేషన్కు తరలించారు. ఎన్నికల పోలింగ్ తర్వాత అప్పటి తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
భారాస ప్రగతి కాళేశ్వరంలో కనిపిస్తోంది: జీవన్రెడ్డి ఎద్దేవా
భారాస గత పదేళ్లలో చేసిన ప్రగతి కాళేశ్వరం, మిషన్ భగీరథ, యాదాద్రి విద్యుత్తు ప్లాంటు రూపంలో అందరికీ కనిపిస్తోందని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అతిపెద్ద కుంభకోణం ధరణి: కూనంనేని
రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి పోర్టల్ ఏర్పాటు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిలో లోపాలను సరిచేస్తున్నామంటున్నారు. -
అలాంటి వ్యక్తి హోంమంత్రి కావడం విచిత్రమే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడంటూ షా తనపై చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. -
‘కల్కి’ కాంప్లెక్స్లా జగన్ ప్యాలెస్ అక్రమాలు
కల్కి సినిమాలో కాంప్లెక్స్లా మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్.. అక్రమాలకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్రావు ధ్వజమెత్తారు. -
జగన్, సాక్షి పత్రికలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తాం
జగన్ పాలనలో జరిగిన విధ్వంసాలపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా అధినేత జగన్, సాక్షి మీడియాకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని శాసనమండలి తెదేపాపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. -
మీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతివ్వాలి?
వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీలో చేసిన ధర్నాలో స్వలాభం తప్ప నిజం లేదని, ఆ ధర్నాతో రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ దూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. -
దిల్లీలో జగన్ డ్రామాలు: కేంద్ర మంత్రి మురుగన్
రాజకీయ ఉనికి కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్రెడ్డి దిల్లీలో డ్రామాలు చేశారని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ మండిపడ్డారు. -
కబ్జాలు చేసిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలి
జగన్ ప్రభుత్వ హయాంలో విలువైన భూములు, స్థలాలను కబ్జా చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా బద్వేలు ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
పథకాలకు మహనీయుల పేర్లు: లోకేశ్
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్ఫూర్తితో పథకాలకు నూతన పేర్లను ప్రకటించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. -
నినాదాలు.. వాగ్వాదాలు
అరుపులు.. కేకలు.. నినాదాలు.. ప్రతిపక్ష సభ్యులు పదే పదే స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లటం.. వీటన్నింటితో బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. రాష్ట్ర బడ్జెట్పై చర్చను భారాస ఎమ్మెల్యే టి.హరీశ్రావు ప్రారంభించారు. -
రేవంత్ సర్కారులో షాడో క్యాబినెట్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వంలో షాడో క్యాబినెట్ పనిచేస్తోందని, నలుగురి ఆధ్వర్యంలో అన్నీ నడిపిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటోంది
ముఖం చెల్లకనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నాటి నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కేసీఆర్లాగా కాంగ్రెస్ కూడా మూర్ఖపు ఆలోచనలు చేస్తోంది. -
5 నెలల్లోనే అద్భుతాలు చేయాలనుకుంటే ఎలా?: మంత్రి శ్రీధర్బాబు
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. లోక్సభ ఎన్నికల కాలాన్ని తీసేస్తే ఐదు నెలలు మాత్రమే చేతిలో ఉంటుంది. ఇంతలోనే అద్భుతాలు చేయాలని కొందరు సభ్యులు అనుకుంటున్నారు’ అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత వారికి ఉందా?: మంత్రి పొన్నం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని కిషన్రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత ఉందా? అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే రూ.9 లక్షల కోట్లు కావాలి
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కనీసం రూ.9 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ హామీలను ఎలా అమలు చేస్తారు’ అని శాసనసభలో భాజపాపక్ష ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. -
ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాలకూ నిధులు
-
నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ సరికాదు
నీతిఆయోగ్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి అన్నారు. ఏవైనా విభేదాలుంటే.. సమావేశానికి హాజరై సీఎం తన అభిప్రాయాన్ని తెలపాల్సిందన్నారు. -
జగమొండి సర్కారు నిర్లక్ష్యమే పెద్దవాగు రైతులకు శాపమైంది
ఏపీ గత జగమొండి సర్కారు నిర్లక్ష్యమే పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారిందని ఆ రాష్ట్ర మంత్రులు విమర్శించారు. -
సంక్షిప్త వార్తలు (7)
భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో అమలవుతున్న కీలక పథకాలు, ఉత్తమ విధానాలు, కేంద్ర సంక్షేమ పథకాలు అందుతున్న తీరు వంటివి సమీక్షించారు. -
ఆర్థిక పరిస్థితి తెలిసీ.. హామీలెలా ఇచ్చారు?
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఈ సభలో ఎప్పటి నుంచో ఉన్నారు. అన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ హామీలు ఎలా ఇచ్చింది’ అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్వీయూ పీఎస్కు చెవిరెడ్డి మోహిత్రెడ్డి తరలింపు
-
పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు: దేవినేని ఉమా
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
భార్యను చూసేందుకని.. బస్సునే అపహరించాడు
-
భారాస ప్రగతి కాళేశ్వరంలో కనిపిస్తోంది: జీవన్రెడ్డి ఎద్దేవా
-
సాఫ్ట్వేర్ హుషార్.. రిక్రియేషన్ క్లబ్లు, క్రీడా వసతులు కల్పిస్తున్న సంస్థలు