- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Paper Leaks: పేపర్ లీక్ చేస్తే.. యావజ్జీవకారాగార శిక్ష.. రూ.కోటి జరిమానా!
పేపర్ లీకేజీ సమస్యతో సతమతమవుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ఘటనలను రూపుమాపేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
లఖ్నవూ: పేపర్ లీకేజీలతో తీవ్ర సతమతవుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ను (Ordinance) తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మంగళవారం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నేర తీవ్రతను బట్టి కనిష్ఠంగా రెండేళ్లు, గరిష్ఠంగా యావజ్జీవ కారాగారశిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. ఈ తరహా నేరాలను నాన్బెయిల్బుల్ కేసులుగా నమోదు చేయనున్నారు. బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడినా.. కఠిన నిబంధనలు విధించనున్నారు. ఉత్తర్ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు యూపీ సబార్డినేట్స్ సర్వీస్ సెలక్షన్ బోర్డు, యూపీ బోర్డు, రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలు, దాని అధీకృత సంస్థలు, ఆయా సంస్థలు నియమించిన ఏజెన్సీలన్నింటికీ ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కన్ఫర్మేషన్, ప్రమోషన్ కోసం నిర్వహించే పరీక్షలు కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయి. తప్పుడు ప్రశ్నపత్రాలు సృష్టించడం, ఉద్యోగాల పేరుతో తప్పుడు వెబ్సైట్లు నడిపించడం కూడా నేరం కిందికే వస్తుంది. ఒక వేళ లీకేజీ లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల పరీక్ష రద్దయితే.. అందుకు కారకులైనవారు, నేరానికి పాల్పడిన వారిపైనే ఆ ఆర్థిక భారం వేసేందుకు వీలుగా ఆర్డినెన్స్లో ప్రత్యేక నిబంధన తీసుకొస్తున్నారు. నేరానికి పాల్పడిన, సహకరించిన ఏజెన్సీలు లేదా సంస్థలను శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు.
ఉత్తర్ప్రదేశ్లో నిర్వహించిన పలు ఉద్యోగ అర్హత పరీక్షల ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే దీనికి ఓ పరిష్కారాన్ని చూపిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. యూపీలో ఇటీవల నిర్వహించిన రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఉద్యోగాలతోపాటు, 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలు లీకేజీ కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
పులివెందులలోని మున్సిపల్ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. -
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. -
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్