- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Byreddy shabari: కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు.
దిల్లీ: వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది.
మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైకాపా ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా’’ అని శబరి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. -
అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటే.. పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారు: పవన్
గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. -
బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫేస్బుక్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. -
హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన: రఘునందన్రావు
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. -
ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు
సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఝార్ఖండ్ సీఎం పీఠంపై మళ్లీ హేమంత్ సోరెన్!
భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవల బెయిల్పై విడుదలైన జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. -
జగన్ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల యజమానుల సమస్యపై మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి స్పందించారు. -
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. -
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
వైకాపా హయాంలో తెదేపా (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు: కేటీఆర్
భారాస ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. -
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా