Byreddy shabari: కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. 

Updated : 02 Jul 2024 18:48 IST

దిల్లీ: వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది.

మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైకాపా ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా’’ అని శబరి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని