- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Palla srinivasa Rao: తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసుల్ని ఏడాదిలో తొలగించేలా చూస్తానన్నారు. పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ.. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని తెలిపారు. ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని శుక్రవారం ఆయన స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆయన్ను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లోకేశ్ సూచించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి నామినేటెడ్ పదవులిచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాల్ని నాయకులు, కార్యకర్తలు అమలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా తట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు.
పల్లా శ్రీనివాసరావును తెదేపా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చోబెడుతున్న మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం బుద్ధి చెబుదాం..
అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించకూడదని శ్రీనివాసరావు అన్నారు. ‘మనమందరం ప్రజాస్వామ్యవాదులం. మన మూలాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతల్ని అణచివేయడానికే అధికారాన్ని వినియోగించింది. అందుకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి చట్టప్రకారం బుద్ధి చెబుదాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. సీనియర్లను గౌరవిస్తూనే యువతను ప్రోత్సహిస్తాం. అమరావతి, పోలవరం నిర్మాణం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధినాయకత్వంతో కలిసి ముందుకెళ్తాం’ అని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
పల్లా శ్రీనివాసరావును అభినందిస్తున్న సీఎం చంద్రబాబు
పల్లాకు చంద్రబాబు అభినందనలు: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును పల్లా దంపతులు కలిశారు. తనకీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని సీఎం అభిలషించారు. పల్లా బాధ్యతలు స్వీకరిస్తున్న చిత్రాల్ని చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రులు నక్కా ఆనంద్బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నెట్టం రఘురాం, సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తదితరులు పల్లాను సత్కరించి అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. -
ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. -
ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి
విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కారుపై పోలింగ్ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. -
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’
జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. -
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్
విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
సమాజ్వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్, ఉద్ధవ్లతో కలిసే ఎన్నికలకు: శరద్పవార్
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ స్పష్టం చేశారు. -
భారాస బాటలోనే కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ జెండాలు
కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. -
కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం
మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. -
నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాహుల్జీ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
పశ్చిమబెంగాల్లో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్ష భాజపా, సీపీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన ఇలాగే ఉంటుందంటూ ఓ వీడియోను పోస్టు చేశాయి. -
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్, తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.