- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TDP: ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు.
30 కేసులున్న జగన్ దృష్టిలో.. 14 కేసులున్న పిన్నెల్లి సౌమ్యుడే
జగన్పై తెదేపా నేతల మండిపాటు
ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. చేసిన పాపాలకు త్వరలోనే జగన్ కూడా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తదితరులు గురువారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కులం, ప్రాంతం, పార్టీలకతీతంగా పాలన చేశామని చెప్పే జగన్.. కక్ష సాధింపుల్లో మాత్రమే సమానత్వం పాటించారు. అమరరాజ కంపెనీ, సంగం డెయిరీ, రామోజీరావు, రఘురామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబును కూడా వదలిపెట్టకుండా అందరినీ వేధించారు. చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందని చెప్పిన జగన్.. తన భుజంపై బఠానీ గింజంత గాయమైతే దళితుడైన శీనును ఐదేళ్లు జైల్లో ఉంచలేదా? తనపై చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో పిన్నెల్లిని ఉంచిన జైల్లోనే పెట్టించలేదా? సీఎంగా చేసిన వ్యక్తి.. ఈవీఎం పగలకొడితే తప్పేంటని ప్రశ్నిస్తారా? ఎన్నికల ప్రక్రియపై జగన్కు కనీసం గౌరవం ఉందా?’ అని వారు ప్రశ్నించారు. జగన్ అండతోనే పిన్నెల్లి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని మండిపడ్డారు.
- మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో స్పందించారు. ‘పిన్నెల్లి మంచివాడు, సౌమ్యుడు అని జగన్ చెప్పడం సిగ్గుచేటు. కుల, మత, ప్రాంతాలేవీ చూడమని చెప్పిన జగన్కు 11 సీట్లే ఎందుకొచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాల’ని పేర్కొన్నారు.
- అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ‘బీసీ నాయకుడు చంద్రయ్యను నడిరోడ్డుపై గొడ్డలితో పిన్నెల్లి నరికించారు. 20 ఏళ్లుగా మాచర్లలో పిన్నెల్లిపై 14 కేసులున్నాయి. నరహంతకుడు, కబ్జాదారును సౌమ్యుడు, మంచివాడుగా జగన్ కీర్తించడం సిగ్గుచేటు. 30 కేసులున్న జగన్కు 14 కేసులున్న రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కన్పించడంలో ఆశ్చర్యం లేద’ని ఎద్దేవాచేశారు.
గొడవలు సృష్టించాలనే ములాఖత్కు అనుమతి కోరారు: హోంమంత్రి అనిత
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్కు మాజీ సీఎం జగన్ అనుమతి కోరారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నిబంధనల ప్రకారం పిన్నెల్లికి ఇవ్వాల్సిన ములాఖత్లన్నీ అయిపోయాయని, అనుమతించే అవకాశం లేదని తెలిసీ జగన్ దరఖాస్తు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతోనే జగన్కు అవకాశం ఇచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈవీఎంలను ధ్వంసం చేసి, పోలీస్ అధికారిపై హత్యకు యత్నించిన నిందితుడిని పరామర్శించేందుకు జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారు. బయటకొచ్చి ఏదేదో మాట్లాడారు. వైకాపా హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినా, వారి కుటుంబ సభ్యులకు మూడో ములాఖత్ ఇవ్వలేదు’ అని అనిత గుర్తుచేశారు.
ములాఖత్కు రూ. 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వెళ్లిన పెత్తందారు: లోకేశ్
ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చడానికి రూ.25 లక్షలు ఖర్చు చేసి మరీ హెలికాప్టర్లో వెళ్లిన పెత్తందారు.. పల్నాడులో తెదేపా కార్యకర్త చంద్రయ్యను చంపిందెవరో చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. పిన్నెల్లితో ములాఖత్ తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్లో లోకేశ్ స్పందించారు. ‘డాక్టర్ సుధాకర్ను చంపిందెవరు? ప్రజావేదికను కూల్చిందెవరు? బీసీ బిడ్డ అమర్నాథ్గౌడ్ను హత్య చేసిందెవరు? ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి కారకులెవరు? అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపిందెవరు?’ అని ప్రశ్నలు కురిపించారు.
పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్ వంతపాడడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి విమర్శించారు. ‘వైకాపా పాలనలో పిన్నెల్లి మారణ హోమం సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాచర్లకు వెళ్లిన తెదేపా నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై బహిరంగంగా హత్యాయత్నం చేసినా చర్యలు తీసుకోలేద’ని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం
విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు పేర్కొన్నారు. -
తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్
సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.. ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదుచేశారు. -
మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు
పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. -
తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి
వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. -
వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. -
ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. -
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే
భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభుత్వ సలహాదారుగా కేకే
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్ ఎఫైర్స్) సలహాదారుగా ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. -
రేపు విజయవాడకు సీఎం రేవంత్రెడ్డి
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ
కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ
నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... -
అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్లో చేరండన్న మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలవడం చర్చనీయాంశమైంది. -
పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. -
గుజరాత్లో భాజపాను ఓడిస్తాం
ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చెప్పారు. -
అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలు
సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్