- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ministerial posts: హస్తినలో ఆశావహుల సందడి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవుల కోసం పలువురి దిల్లీ బాట
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే అధిష్ఠానంతో చర్చలు కూడా జరిగాయని కాంగ్రెస్ ముఖ్యనాయకులు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విన్నవించడం, పార్టీ అధిష్ఠానంతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 24న దిల్లీకి వెళ్లారు. ఆయనతోపాటు కొందరు మంత్రులు అదే రోజు వెళ్లగా, మరికొందరు మంగళవారం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు బుధవారం హస్తినకు చేరుకున్నారు. మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జి.వివేక్, రామచంద్రునాయక్, మల్రెడ్డి రంగారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా దిల్లీ వెళ్లారు. ఎంపీలకు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు కూడా వీరంతా హాజరైనట్లు తెలిసింది. ఆశావహుల్లో పలువురు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ను కూడా కలిసి మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది.
నాలుగు పదవులు.. పోటీలో పలువురు..
రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం నలుగురిని తీసుకుని మరో రెండు మంత్రి పదవులను ఖాళీగా ఉంచనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి, జి.వివేక్కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నందున ఆయన సోదరుడికి చోటు దక్కుతుందా అనే చర్చ ఉన్నా.. రాజగోపాల్రెడ్డి విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. జి.వివేక్, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండగా, పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి వివేక్ కుమారుడు వంశీకృష్ణ గెలుపొందారు. వివేక్కు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని బలంగా వినిపిస్తోంది. కానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కూడా మంత్రిపదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు అవకాశమివ్వాలని ఓ సీనియర్ మంత్రి కూడా గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అందువల్ల ఆయనకు కచ్చితంగా స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. విపక్షంలో ఉన్నప్పుడు సుదర్శన్రెడ్డి.. ఈడీ సహా పలు కేసులను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారని, దీంతోపాటు సీనియార్టీ, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ ఉండగా, అదే జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఎస్టీల నుంచి ఒకరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారాస నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగానే మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి కుమారుడికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.
సోనియా గాంధీతో ఉత్తమ్ భేటీ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం దిల్లీలోని 10-జన్పథ్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా సోనియాను కలిసిన ఉత్తమ్.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల వైకాపాలో పెండింగ్ బిల్లుల పంచాయితీ!
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులపై వైకాపా నాయకుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. -
ఏయూలో అక్రమాలను తవ్వి తీస్తాం
‘వైకాపా పాలనలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక వర్సిటీల ప్రతిష్ఠ మసకబారింది. ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి. -
వైకాపా నేతల చేతుల్లోకి పేదల భూములు
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసమని చేపట్టిన భూసమీకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రైతులను మోసగించి రూ.కోట్ల విలువైన భూములను కొందరు తేలికగా కొట్టేశారు. -
నేడు ‘శక్తి’ కేంద్రాల్లో ‘మన్కీ బాత్’ వినిపించాలి
ప్రధాని మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని ఆదివారం అన్ని ‘శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. -
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఎం
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
మోదీ నైతికంగా ఓడిపోయారు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడియారని, అయినా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా కొనసాగుతున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు. -
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఝార్ఖండ్లో భాజపా మాయం
హవాలా కేసులో తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిన భాజపా.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. -
భారాస హయాంలో రైతుబంధు దుర్వినియోగం: ఎమ్మెల్యే యెన్నం
భారాస ప్రభుత్వ హయాంలో 42 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుబంధు దుర్వినియోగమైందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్పై మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్లున్నారు
‘కేసీఆర్పైన, గత ప్రభుత్వంపైన మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్టుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా మీ మాటల్లో స్పష్టమైంది. -
రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ
‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను. -
పేదల బియ్యంతో అక్రమాల సామ్రాజ్యం
పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు
-
ఆపద్బాంధవుడు బుమ్రా
-
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం