- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shashi Tharoor: శశిథరూర్ ‘నీట్’ కౌంటర్.. ‘ఉత్తర్’ ప్రదేశ్పై ఘాటు వ్యాఖ్యలు
నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన పోస్టు రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది.
దిల్లీ: తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తంచేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలపై దెబ్బకొడతాయి. నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ.. ‘ఎక్స్’లో ఆయన పెట్టిన పోస్టు రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. ఉత్తర్ప్రదేశ్ను తక్కువ చేసేలా ఆయన వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయి. దీనిపై భాజపా చిర్రుబుర్రులాడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
శనివారం రాత్రి శశి థరూర్ ఎక్స్ వేదిగా హిందీలో ఓ ఫొటోను పోస్టు చేశారు. ‘ఉత్తర్ప్రదేశ్ అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఏ రాష్ట్రంలో అయితే పరీక్షలకు ముందే జవాబులు (ఉత్తర్) బయటకొస్తాయో అదే ఉత్తర్ప్రదేశ్ ’ అని రాసి ఉంది. దీనికి ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ పరీక్షా పే చర్చ’ ఖాతాను కూడా ట్యాగ్ చేశారు. నెట్, నీట్-యూజీ 2024 పరీక్షలతోపాటు, ఉత్తర్ప్రదేశ్లోని వివిధ ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీకైన నేపథ్యంలో.. అటు కేంద్రానికి, ఇటు యూపీ ప్రభుత్వానికి చురకలు అంటించేలా ఈ పోస్టు ఉంది. ఈ ఏడాది ఉత్తర్ప్రదేశ్లో పలు రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లు లీకయ్యాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గతంలోఈ రాష్ట్రంలో 62 లోక్సభ స్థానాలను గెలుచుకున్న భాజపా.. తాజాగా 33 స్థానాలకు పడిపోవడానికి పేపర్ల లీకేజీ కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, శశి థరూర్ పోస్టుపై.. భాజపా నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ‘‘ నా రాష్ట్రాన్ని కించపరుస్తూ శశి థరూర్ చేసిన వ్యాఖ్యల్లో హస్యమేమీ కనిపించడం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం యూపీ ప్రజలను కించపరచడమే. దీనిని ప్రజలంతా ఖండించాలి’’ అని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు అలవాటేని, ఇదే దేశంలో పుట్టినవారిని కించపరచడం వారికే చెల్లిందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. ప్రపంచ పౌరుడిగా చెప్పుకొనే థరూర్ లాంటి స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎద్దేవా చేశారు. ఇటీవల అదే పార్టీకి చెందిన శ్యామ్ పిట్రోడా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారని భారతీయులు ఆఫ్రికన్స్లా, చైనీయుల్లా ఉంటారని అవహేళన చేశారని మండిపడ్డారు. సుపీరియారిటీ కాంప్లెక్ కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. యూపీ ప్రజలను మోసగాళ్లుగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టడం సరికాదని, ఇది క్షమించరాని నేరమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మండిపడ్డారు.
నీట్-యూజీ 2024 పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జులై 6 నుంచి యథాతథంగా కౌన్సిలింగ్ కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ (CBI) ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. -
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. -
భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్
భారాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్ అయ్యారు. -
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. -
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు -
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. -
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. -
ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. -
ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి
విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కారుపై పోలింగ్ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. -
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్
విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
సమాజ్వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్, ఉద్ధవ్లతో కలిసే ఎన్నికలకు: శరద్పవార్
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ స్పష్టం చేశారు. -
భారాస బాటలోనే కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ జెండాలు
కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. -
కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం
మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. -
నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాహుల్జీ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
-
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాగూర్ విమర్శలు
-
ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 5PM
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజు
-
రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
-
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?