- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద భద్రతలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద భద్రతలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. తాడేపల్లిలోని జగన్ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది. భద్రతలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్ను తొలగించింది. జగన్ ఇంటికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్పోస్టులను సైతం అధికారులు తొలగించారు.
YS Jagan: జగన్ రక్షణకే 986 మంది
అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో ఏకంగా 986 మంది సిబ్బంది ఉన్నారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సిబ్బందితోపాటు ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు అందుబాటులో ఉండేవి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉండేవారు. మాజీ సీఎం అయ్యాక కూడా ఈ తరహా భారీ భద్రత కొనసాగుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పులకు ఉపక్రమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి
విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల వీరంగం
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. -
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
NEET Row| కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. -
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
శారద పీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. -
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. -
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. -
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి
నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. -
అగ్నివీరులపై రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు
అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
పరువు నష్టం కేసులో టీఎంసీ ఎంపీకి రూ.50 లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
-
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
-
‘అమర్నాథ్’ బస్సు బ్రేకులు ఫెయిల్.. సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు
-
రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఛైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి
-
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత