- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు.
దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.
జీవన్రెడ్డి సేవలను పార్టీ వినియోగించుకుంటుంది
‘‘జీవన్రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించమని అధిష్ఠానానికి ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్లో నిధుల కోసం కేంద్రమంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తాం.
ఏపీతో ఎలాంటి సమస్యలూ లేవు.. ఉన్నా పరిష్కరించుకుంటాం..
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి భారాసకు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్రం
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు. దానికి పునాది వేసింది కేసీఆరే. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో భాజపా వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడతామని భారాస, భాజపా రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్రం. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాస ఓటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో భాజపాను కేసీఆర్ గెలిపించారు. కంచుకోటగా చెప్పుకొనే మెదక్లో భారాస మూడో స్థానంలో నిలిచింది. సిరిసిల్ల, సిద్దిపేటలో భాజపాకు అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి?
ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్హౌస్ తలుపులు తెరిచారు. రాష్ట్రావతరణ దినోత్సవాలకు కేసీఆర్ను ఆహ్వానించాం. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది భారాస ఎమ్మెల్యే జగదీశ్రెడ్డే. విచారణ కమిషన్ కేసీఆర్కు లేఖ రాయగానే విచారణ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రావతరణ వేడుకల్లో విపక్ష నేత మాట్లాడే సంప్రదాయం ఉందా?గతంలో మాకు కనీసం ఆహ్వానం కూడా లేదు’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
పులివెందులలోని మున్సిపల్ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. -
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. -
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్