- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: పేదల బియ్యంతో అక్రమాల సామ్రాజ్యం
పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది.
రేషన్ మాఫియాకు చిరునామా కాకినాడ
కీలక శాఖల దాసోహంతో ఐదేళ్లూ ఆడిందే ఆట
అన్నివేళ్లూ వైకాపా నేత ద్వారంపూడి కుటుంబం వైపే
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది. ఇందుకు కాకినాడను అడ్డాగా చేసుకుని పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తోంది. సొంతనౌకల్లో సరకు తరలిస్తూ.. విదేశాల్లోనూ గోదాములు కట్టుకుని అక్రమాల సామ్రాజ్యాన్ని విస్తరించారు. వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగిన ఈ అక్రమాల తంతుకు కీలక శాఖలు ఊతమందించాయి. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక పాపాల పుట్ట కదిలింది. కాకినాడ రేషన్ మాఫియా అక్రమాలు బయటపడ్డాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు సంస్థల్లో సోదాలు చేశారు. వేలటన్నుల అక్రమ నిల్వలు సీజ్ చేయించారు. ఈ అక్రమాల్లో కాకినాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానిది, అనుచరులదే కీలక పాత్రని బాహాటంగా వెల్లడించారు. సీఐడీ విచారణ చేయిస్తామని ఆయన వెల్లడించడంతో కాక రేగింది.
ఆ కుటుంబంలో ముగ్గురూ..
వైకాపా ప్రభుత్వంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి రేషన్ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన తండ్రి భాస్కరరెడ్డి పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా వ్యవహరించారు. సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్ సంస్థ సంఘం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కొందరు మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. యాంకరేజి పోర్టుతోపాటు.. పలు గోదాముల్లో 12,915 టన్నుల బియ్యం సీజ్చేయడం.. ఈ సంస్థలు అనుయాయులవే కావడంతో అన్నివేళ్లూ ద్వారంపూడి వైపే చూపిస్తున్నాయి.
అక్రమాలకు ఎర్ర తివాచీ
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే.. ఇందులో సగం మాఫియా పక్కదారి పట్టిస్తోంది. అర్హత లేనివారికి కార్డులు ఉండడం, వారికి ఈ బియ్యం తినే అవసరం లేకపోవడం మాఫియాకు కలిసొస్తోంది. ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకుని సరకు పక్కన పెడుతున్నారు. ఊరూరా దళారులు సేకరించిన ఈ నిల్వలన్నీ ఓ చోటుకు చేరవేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసు, రవాణా, పౌరసరఫరాలు, తూనికలు- కొలతలు, వాణిజ్యపన్నుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోర్టు ఇలా అన్ని శాఖల అధికారులూ అక్రమాల్లో సహకరించారు. పోర్టు ఆధీనంలోని గోదాముల్లోనూ చౌకబియ్యం గుర్తించడం.. పోర్టు అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై చర్చ నడుస్తోంది. పోర్టులకు వెళ్లే సరకుల తనిఖీకి చెక్పోస్టు వ్యవస్థ లేకపోవడం.. అక్కడి పర్యవేక్షక యంత్రాంగం దాసోహమవ్వడం అక్రమాలకు ఊతమిచ్చింది.
కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. పోర్టుల్లో బియ్యం లోడింగ్, అన్లోడింగ్కు బిహార్, ఒడిశా కూలీలను వినియోగిస్తున్నారు. గతంలో కాకినాడలోని యాంకరేజి పోర్టు ద్వారానే బియ్యం ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతుల సామర్థ్యం పెంచి.. అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో 400 రైస్మిల్లులు ఉన్నాయి ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడ ఉండడం.. పౌరసరఫరాల వ్యవస్థ ఒక కుటుంబం చేతిలో ఉండడం కలిసొచ్చిన అంశం. ఐదేళ్లూ వేలకోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా అక్రమ సేకరణ ఆగలేదు. ఎక్కడికక్కడ భారీగా నిల్వలు ఉంచారు. నూకలుగా చేసి తరలించే ప్రక్రియ కొనసాగించారు. మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. -
అగ్నివీరులపై రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు
అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి
నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
పరువు నష్టం కేసులో టీఎంసీ ఎంపీకి రూ.50 లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు: ఖర్గే
పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయటం ద్వారా కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. -
కోట్ల మంది హిందువులను అవమానించారు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది. -
హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టులాంటిది
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడం మాజీ సీఎం కేసీఆర్కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు. -
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరాలన్న జైరాం రమేశ్
వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ప్రత్యేక హోదాపై తీర్మానం చేయండి
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు. -
విప్లుగా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్
జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికార విప్లుగా ప్రకటించాలని కోరుతూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. -
1995 నాటి చంద్రబాబును చూస్తారు
‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్ చేస్తా. -
అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోదీ మన్కీబాత్
ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించిందని, దీనిని ప్రధాని మోదీ తన మన్కీబాత్లో గుర్తించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. -
కాంగ్రెస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు