- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nadendla Manohar: రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ
‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను.
పేదల పొట్టకొట్టి.. ఆఫ్రికన్ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు
ద్వారంపూడి కుటుంబం అక్రమాలు చూసి ఆశ్చర్యపోయా
తనిఖీలు పూర్తయ్యేవరకు పోర్టులో బియ్యం ఎగుమతుల నిలిపివేత
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఈనాడు, కాకినాడ: ‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను. కాకినాడలోని గోదాములు, యాంకరేజ్ పోర్టులో పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఈ కేసును సీఐడీకి అప్పగిస్తాం’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్ని గోదాముల్లో లోతుగా తనిఖీలు చేయిస్తామని.. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలు పూర్తయ్యేవరకు షిప్పింగ్ మొత్తం నిలిపేయాలని పోర్టు అధికారులను ఆదేశించారు. యాంకరేజి పోర్టులో గోదాములు, బార్జిల్లో బియ్యం తరలిస్తున్న లంగరు రేవు పరిశీలించారు.
12,915 టన్నుల బియ్యం స్వాధీనం..
కాకినాడ జిల్లాలో నిర్వహించిన రెండు రోజుల తనిఖీల్లో మొత్తం ఎనిమిది గోదాముల్లో ప్రభుత్వం పేదలకు సరఫరాచేస్తున్న బియ్యం ఉన్నట్లు ఆధారాలతో దొరికిందని.. 12,915 టన్నుల నిల్వలు సీజ్ చేశామని మంత్రి మనోహర్ వెల్లడించారు. కలెక్టరేట్లో శనివారం సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం లవన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ (బిబో), విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, సరళ ఫుడ్స్, సార్టెక్స్ ఇండియా, వి.ఎస్.రాజు గోదాముల్లో తనిఖీ చేసి 7,615.94 టన్నులు సీజ్ చేశామన్నారు. శనివారం కాకినాడ యాంకరేజి పోర్టులోని అశోక్ ఇంటర్నేషనల్ గోదాములో 2,800 టన్నులు, హెచ్1 గోదాములో 2,300 టన్నులు సీజ్ చేశామన్నారు. వీఎస్రాజు గోదాములో 2023- 24 పీడీఎస్ బియ్యం ట్యాగ్లు దొరికాయని, కేసులు పెడతామన్నారు. గోదాముల్లో ఎవరు.. ఏ స్టాక్ తీసుకొచ్చి నిల్వ చేశారో తెలియదన్నట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని పోర్టు అధికారి ధర్మశాస్తపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పౌరసరఫరాల వ్యవస్థల్లో లోపాలపై 6ఏ కేసులు, తూనికలు- కొలతల శాఖ ద్వారా చర్యలు, పోలీసుశాఖ ద్వారా క్రిమినల్ కేసులూ ఉంటాయన్నారు. పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నిస్తే కొంతమంది తమిళనాడు పౌరసరఫరాల శాఖకు, ఇతర ప్రాంతాలకు పంపుతున్నామని చెబుతున్నారని... అది సరికాదన్నారు. పీడీఎస్ బియ్యం దారి మళ్లించినట్లు తేలిందని.. నూటికి నూరుశాతం క్రిమినల్ కేసులు పెడతామన్నారు.
కాకినాడలోని అశోక్ ఇంటర్నేషనల్ గోదాములో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్
లక్షల మందికి అన్యాయం చేశారు
సామాన్యుడి పొట్ట కొట్టి అద్భుతంగా పాలిస్తున్నామని చెప్పుకొని లక్షల మందికి వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని నాదెండ్ల వ్యాఖ్యానించారు. కేజీ బియ్యానికి ప్రభుత్వం రూ.39 ఖర్చుచేసి.. పేదలకు రూపాయికి ఇస్తుంటే దళారులు రూ.8, రూ.10 ఇచ్చి కొనుక్కుంటున్నారని తెలిపారు. కాకినాడలో వ్యవస్థీకృత మాఫియా పోర్టును అడ్డాగా మార్చుకుని అవినీతికి పాల్పడుతోందన్నారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని ఒక కుటుంబం కోసం ఎలా ఉపయోగించుకున్నారో అందరికీ తెలుసన్నారు.
నేనొస్తున్నానని తెలిసి నిల్వలు తరలించేశారు
కాకినాడ పోర్టు అంటే అందరూ భయపడుతున్నారని.. సొంతంగా నౌక ఏర్పాటుచేసుకునే స్థాయికి అక్రమార్కులు ఎదిగారంటే.. ఎంత బియ్యం ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేశారో అర్థంచేసుకోవచ్చని మంత్రి అన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఖాతాలున్నాయని.. పలు రాష్ట్రాల నుంచి సరకు తెస్తున్నారని ఆరోపించారు. తన పర్యటన ఉందని తెలిసి మూడు, నాలుగు రోజులుగా చాలా నిల్వలు తరలించేశారని.. టోల్గేట్ల దగ్గర పదిరోజుల సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని అందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సీఐడీని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామన్నారు.
ధాన్యం సొమ్ము రూ.వెయ్యి కోట్లు ఖాతాల్లో వేస్తాం
వచ్చే సీజన్కల్లా ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటామని, పీడీఎస్ బియ్యం పంపిణీలో లోపాలు సరిదిద్దుతామని మంత్రి మనోహర్ తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లకు వివరిస్తే స్పందించి రూ.1,600 కోట్లలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తామని తెలిపారన్నారు. నాలుగైదు రోజుల్లో సొమ్ము ఖాతాల్లో పడుతుందని.. మిగిలిన రూ.600 కోట్లు నాబార్డ్, ఇతర బ్యాంకులతో మాట్లాడి విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డపై విష ప్రచారమని తేలింది
మేడిగడ్డపై ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది విష ప్రచారమని ఇప్పుడు తేలిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
భాజపా తగిన మూల్యం చెల్లించుకుంది
నిండు సభలో ఒక మహిళా ఎంపీ నోరు నొక్కేసినందుకు.. ఈసారి ఎన్నికల్లో 63 సొంత ఎంపీ సీట్లు కోల్పోయి భాజపా తగిన మూల్యం చెల్లించుకుందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. -
దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపండి
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని, వెంటనే దానిని ఆపాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండు చేశారు. -
మోదీజీ.. నవ్వరెందుకో!
లోక్సభ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. -
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు. -
నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. -
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరాలన్న జైరాం రమేశ్
వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదాపై తీర్మానం చేయండి
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు. -
విప్లుగా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్
జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికార విప్లుగా ప్రకటించాలని కోరుతూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. -
సంక్షిప్త వార్తలు
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
1995 నాటి చంద్రబాబును చూస్తారు
‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్ చేస్తా. -
అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోదీ మన్కీబాత్
ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించిందని, దీనిని ప్రధాని మోదీ తన మన్కీబాత్లో గుర్తించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. -
కాంగ్రెస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. -
‘నీట్’ రద్దుకు రాజ్భవన్ ముట్టడి యత్నం
నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల ఐక్య కమిటీ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. -
ఇంకేం బాకీ ఉంది?
గత పదేళ్ల తన పాలన ట్రైలరేనని, అసలు ఇప్పుడే మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.