- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramachandra Yadav: భారత చైతన్య యువజన పార్టీ.. ఏపీలో నూతన రాజకీయ వేదిక
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రయాదవ్ నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. ‘భారత చైతన్య యువజన పార్టీ’(బీసీవై)పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. గుంటూరు శివారులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పేరును రామచంద్రయాదవ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీ స్థాపించినట్టు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే .. కొత్త రాజకీయ ప్రస్థానం జరగాలన్నారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయన్నారు. జగన్ పాలన పురాణాల్లో రాక్షసుల్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. వైకాపా పెద్ద ల నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ సభకు అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్, సూరజ్ మండల్, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రామచంద్రయాదవ్ అభిమానులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్
వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్ తగిలింది. -
ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. -
జీవన్రెడ్డికి బుజ్జగింపు
జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలన్న నిర్ణయంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్రెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది. -
రెచ్చిపోతున్న వైకాపా మూకలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 60 మంది యువకులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. -
ఎమ్మెల్యేలపై స్పీకర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు
భారాస బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. -
అవినీతిని మంత్రి పొన్నం పరోక్షంగా అంగీకరించినట్లే
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నీతిమంతుడైతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
జులై 5న కోల్బెల్ట్ బంద్
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. -
విపక్ష నేతగా రాహుల్కు గుర్తింపు
లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి స్పీకర్ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం ప్రకటన (నోటిఫికేషన్) వెలువరించింది. -
నిబంధనల ప్రకారం.. జగన్ ప్రతిపక్ష నేత కాలేరు
‘వైకాపా నాయకుడు జగన్కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఏ పార్టీలూ ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వవు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. -
ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడలేరా?
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే ప్రజాసమస్యలపై పోరాడలేరా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ను తెదేపా నేత సి.రామచంద్రయ్య, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు. -
ఎమ్మెల్సీ దండె విఠల్తో కాంగ్రెస్ చర్చలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనను పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారాసను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
భారాస మునిగిపోతున్న నావ: ఆది శ్రీనివాస్
భారాస మునిగిపోతున్న నావ అని.. అందులో ఎవరూ ఉండరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్లో మాట్లాడారు. -
ఫలానా గుర్తు కావాలని కోరలేరు
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ బుధవారం వాదనలు వినిపించింది. -
హస్తినలో ఆశావహుల సందడి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. -
మీకు అండగా నేనుంటా
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ.. ఒత్తిడికి గురిచేస్తూ.. లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని భారాస ఎమ్మెల్యేలనుద్దేశించి పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: సీఎం చంద్రబాబు
-
బుమ్రా నాకంటే 1000 రెట్లు బెటర్: భారత దిగ్గజ క్రికెటర్
-
డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్డీయేకే..!
-
అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘ఇకపై లిఫ్ట్లో సీక్రెట్ మీటింగ్’.. ఫడణవీస్తో భేటీపై ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు