- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
NEET Row| కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
NEET Row| దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. నీట్ వ్యవహారం(NEET Row)పై లోక్సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నీట్ అంశంపై చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే సముచితంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జూన్ 28న నీట్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని విపక్షాలు కోరగా.. అందుకు నిరాకరించారన్నారు. సోమవారం కూడా ఇదే అంశంపై మళ్లీ చర్చకు అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని స్పీకర్ విపక్షాలకు హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
నీట్ ఆశావహుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్.. ఈ వ్యవహారంపై నిర్మాణాత్మకంగా అడుగులు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నీట్ పరీక్షపై తక్షణమే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది మన ఉన్నత విద్యా వ్యవస్థలో కుళ్లును బహిర్గతం చేసిందన్నారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్ లీకేజీలు జరిగాయని, వీటితో 2కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ధైర్యంగా, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని మనవైపే చూస్తున్నారని తెలిపారు. అందువల్ల పార్లమెంట్లో జరిగే చర్చ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తొలి అడుగుగా ఉండాలన్నారు. నీట్ అంశం తీవ్రత దృష్ట్యా బుధవారం లోక్సభలో చర్చకు సులభతరం చేసేలా చూడాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. -
అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం: కేసీఆర్
దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. -
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్ ఠాకూర్ అసత్య ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని, వారిపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ లేఖ రాసింది. -
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
జగన్ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. -
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. -
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
తణుకు టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. -
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. -
దిల్లీ, హరియాణాల్లో వారితో పొత్తు లేనట్లే...! కాంగ్రెస్
ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పొత్తుల విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు రూ.25 లక్షలు: హోంమంత్రి అనిత
ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు
రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు (కేకే) రాజీనామా చేశారు. -
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచిదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచిదేనని భాజపా సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. -
జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన జగన్
ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైకాపా అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆయన భేటీ అయ్యారు. -
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. -
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. -
ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశ్వవిజేతల విజయ యాత్ర.. క్రికెట్ ఫ్యాన్స్తో జనసంద్రంగా మారిన ముంబయి
-
పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన
-
ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడులు!
-
రోహిత్.. పిచ్ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ
-
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ
-
అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం: కేసీఆర్