KTR: రాజ్యాంగానికి రాహుల్ తూట్లు
‘‘ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ నాయకులు మంగళం పాడి.. మా ఆరుగురు ఎమ్మెల్సీలను, ఏడుగురు ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి పాత్రధారి.. రాహుల్ గాంధీ సూత్రధారి.
మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చట్టవిరుద్ధంగా కాంగ్రెస్లో చేర్చుకున్నారు
ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
రాష్ట్రపతికి, ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తాం
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో దామోదర్రావు, కేఆర్ సురేశ్రెడ్డి, హరీశ్రావు, వద్దిరాజు రవిచంద్ర
ఈనాడు, దిల్లీ: ‘‘ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ నాయకులు మంగళం పాడి.. మా ఆరుగురు ఎమ్మెల్సీలను, ఏడుగురు ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి పాత్రధారి.. రాహుల్ గాంధీ సూత్రధారి. రాజ్యాంగం చేత్తో పట్టుకొని తానే రాజ్యాంగ రక్షకుడినన్నట్లు చెబుతున్న రాహుల్.. అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ ద్విపాత్రాభినయానికి ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దివాలాకోరుతనాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టడానికి దిల్లీ వేదికగా పోరాటం చేయనున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రపతిని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. భావసారూప్య పార్టీలతో కలిసి దిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆటోమేటిక్గా వేటుపడేలా చేస్తామని తుక్కుగూడ సభలో విడుదల చేసిన న్యాయ్పత్రలో కాంగ్రెస్ ప్రకటించిందని, దాన్ని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఇదివరకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. భారాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలన్న తమ ఫిర్యాదుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని హైకోర్టులో సవాల్ చేశామని, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఇక్కడ మాజీ మంత్రి హరీశ్రావు, భారాస పార్లమెంటరీ పార్టీనేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్రావులతో కలిసి విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
అధిష్ఠానం అనుమతితోనే..
‘‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిల్లీకొచ్చి పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకొని మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. న్యాయ్పత్ర పేరుతో తుక్కుగూడలో విడుదల చేసిన మ్యానిఫెస్టోకు విరుద్ధంగా ఆ వేదికపైనే భారాస నుంచి గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలను రాహుల్ కూర్చోబెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని మోదీ నాశనం చేస్తున్నారని, తానే కాపాడుతున్నానంటూ పార్లమెంటులో రాజ్యాంగం పట్టుకున్న ఆయన.. రెండు కిలోమీటర్ల దూరంలోని ఏఐసీసీ కార్యాలయంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణలోని ఫిరాయింపుల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రధానిని కూడా కలుస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘ఆ ఆలోచన మాకు లేదు. రాజ్యాంగ రక్షకులను కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని చెబుతాం’’ అని అన్నారు. గతంలో తెదేపా, కాంగ్రెస్ల నుంచి గెలిచిన తలసాని, సబితలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే.. మంత్రి పదవులు ఇచ్చారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘విలీనానికి, ఫిరాయింపులకు వ్యత్యాసం తెలుసుకోవాలి. కాంగ్రెస్కు చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది, తెదేపాకు చెందిన 15 మందిలో 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరూ అప్పట్లో తెరాసలో చేరారు. ఇప్పుడు భారాసకున్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు మాత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఒకేసారి 26 మంది చేరితే.. అది విలీనం కిందికి వస్తుంది. ఒక్కొక్కరుగా పోతే అది ఫిరాయింపు కిందికే వస్తుంది’’ అని పేర్కొన్నారు. తెదేపా విలీనం కాకముందే తలసానికి మంత్రి పదవి ఇచ్చారు కదా? అన్న ప్రశ్నకు ఆయన రాజీనామా చేశారని బదులిచ్చారు. ‘‘మాకున్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురిని కాంగ్రెస్ కొనుగోలు చేసిందా? సామదానభేద దండోపాయాలు ప్రయోగించిందా? అన్నది వారే చెప్పాలి. ఆ పార్టీకి ఉన్న 99 మంది ఎంపీల్లో 20-30 మంది మరో పార్టీలో చేరితే కాంగ్రెస్ అంగీకరిస్తుందా?’’ అని అన్నారు. ‘‘తెలంగాణలో ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో తెరాస (ప్రస్తుత భారాస)కు చెందిన 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని తీసుకెళ్లారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.