- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Peddireddy: పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్
వైకాపా కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో భారీ షాక్ తగిలింది.
వైకాపాకు మున్సిపల్ ఛైర్మన్తోపాటు 13 మంది కౌన్సిలర్ల రాజీనామా
రొంపిచెర్లలో తెదేపా ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ ఛైర్మన్ అలీంబాషా, కౌన్సిలర్లు
రొంపిచెర్ల, పుంగనూరు, న్యూస్టుడే: వైకాపా కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీంబాషా, మరో 12 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి (బాబు)ని గురువారం రొంపిచెర్లలోని ఆయన స్వగృహంలో కలిశారు. వీరు త్వరలో పార్టీ అధినాయకుల సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెదేపా తరఫున ఎవరూ నామినేషన్లు వేయకుండా, ఒకవేళ దాఖలు చేసినా వాటిని అధికారులు తిరస్కరించేలా పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపారు. ఇప్పుడు వారే ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఛైర్మన్ అలీంబాషా, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్లు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తమకు పదవులు మాత్రమే ఇచ్చి పెత్తనమంతా ఆయనే చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చల్లా రామచంద్రారెడ్డిలతో కలిసి పనిచేసి తమ వార్డులను అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు. పుంగనూరు పరిధిలో మొత్తం 31 మంది వార్డు కౌన్సిలర్లుండగా, ప్రస్తుతం 13 మంది వైకాపాకు రాజీనామా చేశారు. చల్లా రామచంద్రారెడ్డిని కలిసిన వారిలో మున్సిపల్ ఛైర్మన్ అలీంబాషా, కౌన్సిలర్లు రామకృష్ణరాజు, రహంతుల్లా (జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు), జె.నరసింహులు, యువకుమారి, మమత, వి.కాళీదాస్మొదలియార్, ఖాన్ నూర్జహాన్, కసురున్నీసా, మనోహర్, హర్షద్అలీ, రేష్మా, మహ్మద్గౌస్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. -
ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. -
ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి
విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కారుపై పోలింగ్ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. -
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’
జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. -
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్
విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
సమాజ్వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్, ఉద్ధవ్లతో కలిసే ఎన్నికలకు: శరద్పవార్
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ స్పష్టం చేశారు. -
భారాస బాటలోనే కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ జెండాలు
కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. -
కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం
మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. -
నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాహుల్జీ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
పశ్చిమబెంగాల్లో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్ష భాజపా, సీపీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన ఇలాగే ఉంటుందంటూ ఓ వీడియోను పోస్టు చేశాయి. -
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్, తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.