Prathipati Pulla Rao: పిన్నెల్లి నేర సామ్రాజ్యాన్ని పెకిలించాలి: ప్రత్తిపాటి పుల్లారావు

రౌడీమూకలకు ఇకపై గడ్డు రోజులేనని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Published : 28 Jun 2024 16:13 IST

చిలకలూరిపేట: రౌడీమూకలకు ఇకపై గడ్డు రోజులేనని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దానికి వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టే సంకేతమని చెప్పారు. మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేర సామ్రాజ్యాన్ని పెకిలించాలన్నారు. తెదేపా కార్యకర్త తోట చంద్రయ్య హత్య రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ప్రారంభమైందని చెప్పారు. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా త్వరగా అరెస్ట్‌ చేయాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అండగా నిలిచిన పోలీసు సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని