- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Punganur: పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎంపీ పర్యటన నేపథ్యంలో కూటమి నిరసనలు
మిథున్రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలుపుతున్న కూటమి నాయకులు, కార్యకర్తలు
పుంగనూరు, న్యూస్టుడే: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన వస్తున్నారని తెలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్ కూడలికి పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో స్థానికంగా ఎంపీ సమావేశం కావాల్సి ఉండగా శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను తిరుపతిలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెదేపా పుంగనూరు అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన తెదేపా కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ఎంపీని అడ్డుకొంటామని ముందుకొచ్చారన్నారు. నాడు అధికారం ఉందని తెదేపా శ్రేణులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ తదితర కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబును కుప్పంలో, చల్లా రామచంద్రారెడ్డిని పుంగనూరు నియోజకవర్గంలో అడ్డుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎంపీ పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. ప్రధాన కూడళ్లతోపాటు పట్టణ సరిహద్దులోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి నోటీసు అందజేస్తున్న ఏఎస్పీ కులశేఖర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
-పోలీసుల సూచన
పుంగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వెళ్లకూడదని, నియోజకవర్గంలో పర్యటనను విరమించుకోవాలని ఎంపీ మిథున్రెడ్డికి పోలీసులు సూచించారు. తిరుపతిలోని తన నివాసం నుంచి బయల్దేరేందుకు యత్నించిన ఎంపీకి తిరుపతి ఏఎస్పీ కులశేఖర్ నేతృత్వంలో సీఐలు మహేశ్వర్రెడ్డి, మురళీమోహన్లు నోటీసులు జారీచేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు ఇల్లు దాటి వెళ్లకూడదని స్పష్టం చేశారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం ఆంక్షల వివరాలను పోలీసులు తెలియజేశారు. ఎంపీ నివాసానికి చేరుకోవడానికి యత్నించిన వైకాపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
స్పీకరు దృష్టికి తీసుకువెళ్తా
-మిథున్రెడ్డి
ఈ పరిణామాలపై ఎంపీ మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైకాపా కార్యకర్తలపై తెదేపా భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు గృహనిర్బంధం చేశారని, ఈ విషయాన్ని పార్లమెంట్ స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని సంస్కృతిని తెదేపా నాయకులు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. -
పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్ జవహర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ కొనియాడారు. -
సంక్షిప్త వార్తలు
పదేళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. -
రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం!
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. -
వైఎస్ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్గాంధీ
విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. -
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
హనుమకొండ భారాస కార్యాలయానికి నోటీసులు
హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని... -
తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రాహుల్లా ప్రవర్తించకండి
లోక్సభలో స్పీకర్ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. -
యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. -
ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుండేది
-
నా వ్యాఖ్యల తొలగింపు అప్రజాస్వామికం
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు. -
మీ సర్కారుకు ప్రజలు అదే చెప్పారు
లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.