- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: 1995 నాటి చంద్రబాబును చూస్తారు
‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్ చేస్తా.
తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను
అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుంది
పెనుమాక ప్రజావేదికలో సీఎం
ఈనాడు, అమరావతి: ‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్ చేస్తా. ఇప్పటి వరకు రివర్స్లో వెళుతున్న బండిని ఇప్పుడు ముందుకు తీసుకెళుతున్నాం. ఇక వేగంగా వెళ్లడమే. 4.0....1995 నాటి సీబీఎన్ను చూస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అలా చేయను కానీ....తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘ప్రజలిచ్చిన ఈ గౌరవాన్ని వారి కోసమే వినియోగిస్తా. నా స్వార్థం కోసం ఉపయోగించను. సమర్థవంతమైన పాలన అందిస్తా. గత ఎన్నికల్లో ప్రజలు సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. వారికి సర్వదా కృతజ్ఞుడిగా ఉంటా’ అని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాకలో సోమవారం నిర్వహించిన ప్రజావేదికలో చంద్రబాబు పింఛనుదారులు, గ్రామస్థులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది. పలువురు మహిళలు తమ సమస్యలు విన్నవిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు.
అత్యాచారం చేస్తే అదే చివరి రోజు....
‘ఎవరైనా సరే ఆడబిడ్డలపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే వదిలిపెట్టను. అత్యాచారం చేస్తే అదే వారికి చివరి రోజు. ప్రభుత్వమంటే ఎవరూ తమాషాగా తీసుకోవద్దు. సంఘ విద్రోహ శక్తులను నిర్మొహమాటంగా అణచివేస్తా. మద్యం, గంజాయి మత్తులో ఇష్టానుసారం వ్యవహరిస్తే తీవ్ర చర్యలుంటాయి. మహిళలకు అన్యాయం జరిగితే ఉపేక్షించను. ఇకపై చేతల్లో కూడా అది చూస్తారు’ అని హెచ్చరించారు.
‘రాజధానిని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం అవసరం. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకునేలా కోర్టుకు వెళ్లడం మంచి విధానం కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. ఏ ప్రాజెక్టు కట్టినా దానికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉండేలా పరిహారం అందించి దాన్ని పూర్తి చేసిన ఘనత తెదేపాది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అమరావతిలోనూ అదే చేస్తా’ అని సీఎం పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. -
ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు. -
కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు
గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. -
చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు
‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
రేపు హైదరాబాద్కు చంద్రబాబునాయుడు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. -
9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్
రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం జాప్యం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కర్ణాటక ఉపముఖ్యమంత్రితో వైఎస్ షర్మిల చర్చలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు. -
గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది. -
ఏపీలో ఏడు మండలాల విలీనానికి భారాస, భాజపాలే కారణం
రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. -
2028 ఎన్నికల్లో భారాసదే అధికారం
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్రెడ్డి
దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది. -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన కేశవరావు
భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి
అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు