- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Payyavula Keshav: జగన్ ప్రతిపక్ష నేత కాదు.. వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల
వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.
అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి
‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గుర్తించలేనట్టుంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆ హోదాపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అధికార పార్టీగా మేం హుందాగానే స్పందించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించాం. దేశవ్యాప్తంగా అన్ని శాసన సభలు, పార్లమెంట్లో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా? ఆ సలహాలు తీసుకుంటే మునిగిపోతారు. మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు.. శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షఖ్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. ఓనమాలు కూడా చూసుకోకుండా మీతో ఈ లేఖ రాయించారు. 10 శాతం సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?
అప్పుడు మీ నోటితో మీరే చెప్పారుగా?
మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదన్నారు.. ఏమైంది? శాసనసభ సాక్షిగా మీ నోటితో మీరే చెప్పారు కదా? మళ్లీ ఇప్పుడు 10 శాతం నిబంధన లేదు.. తూచ్ అంటారా? ప్రజలు అధికారం తీసేసినా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్లుంది. ప్రతిపక్ష హోదాతో క్యాబినెట్ ర్యాంకు వస్తుంది.. దానితో జులుం చేయొచ్చనుకుంటున్నారేమో! ఆ ధోరణి మార్చుకోండి. ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి. సభలో మీరు మాట్లాడాలనుకుంటే.. అందరి సభ్యుల్లాగే మీకూ మాట్లాడే హక్కు ఉంటుంది. పార్లమెంట్లో ఉపేంద్రను ఫ్లోర్ లీడర్గా పేర్కొన్నారు తప్ప.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994లో ప్రతిపక్ష నేతగా పీజేఆర్ లేరు. అప్పుడు సీఎల్పీ నేతగా విజయభాస్కర్రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా అప్పటి స్పీకర్ ఆయన్ను గుర్తించారు. బాబూరావు, పీజేఆర్ సీఎల్పీ ఉపనాయకులుగా ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి’’ అని పయ్యావుల అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
పులివెందులలోని మున్సిపల్ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. -
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. -
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్