Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Updated : 30 Jun 2024 22:40 IST

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మూడురోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అభిమాన నేతకు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని