- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
OU Student Motilal: నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ విరమించారు. తొమ్మిది రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘తొమ్మిది రోజుల దీక్షలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ పెరగలేదు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశా. నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నా. దీక్ష చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు పనిచేయని పరిస్థితికి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. 25 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. గ్రూప్-1లో 1:100 శాతం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు పెంచాలి. డీఎస్సీ రద్దు చేసి మెగా డీఎస్సీ ప్రకటించాలి. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. -
జగన్ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల యజమానుల సమస్యపై మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి స్పందించారు. -
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. -
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
వైకాపా హయాంలో తెదేపా (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు: కేటీఆర్
భారాస ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. -
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. -
వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. -
పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్ జవహర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ కొనియాడారు. -
సంక్షిప్త వార్తలు (5)
పదేళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. -
రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. -
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు