- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NDA vs INDIA bloc: పొత్తులు కట్టి... శక్తుల్ని కూడదీసి!
సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మరికొన్ని గంటల్లో విజేతలెవరో తేలిపోనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి.
హోరాహోరీగా తలపడిన ఎన్డీయే, ఇండియా
భాగస్వాములను నడిపించిన భాజపా, కాంగ్రెస్
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మరికొన్ని గంటల్లో విజేతలెవరో తేలిపోనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. మూడోసారి గెలవాలని ఎన్డీయే, దాన్ని అడ్డుకోవాలని ఇండియా కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఇంతకీ ఈ కూటముల్లో ఏ పార్టీలున్నాయి? ఏ కూటమిలోనూ చేరని పార్టీలేవి?...
‘మిషన్ 400’తో ఏన్డీయే
హాట్రిక్పై దృష్టి సారించిన భాజపా చిన్నచిన్న పార్టీలనూ తన ఎన్డీయే కూటమిలో కలుపుకొంది. ‘అబ్కీ బార్ 400 పార్’ అనే నినాదంతో... ఒంటరిగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్లోని మూడు స్థానాలు మినహా దేశవ్యాప్తంగా 540 సీట్లలో పోటీ చేసింది. ప్రస్తుత లోక్సభలో ఎన్డీయే బలం 336 సీట్లుగా ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకుగానూ 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా తన మిత్రులతో కలిసి బరిలో నిలిచింది. మిగిలినచోట్ల సొంతంగా పోటీ చేస్తోంది.
భాజపా తర్వాత తెదేపానే
ఎన్డీయేలో భాజపానే అతిపెద్ద పార్టీ. అది 441 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఆ తర్వాత 17 చోట్ల పోటీ చేస్తున్న తెదేపానే రెండో అతిపెద్ద పార్టీ. ఇవికాకుండా జేడీయూ (16), ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన (15), తమిళనాడులో అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పట్టలి మక్కల్ కట్చి (10), లోక్ జనశక్తి పార్టీ (5), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (5) ప్రధాన పార్టీలు. కూటమిలో జేడీఎస్ (3), జనసేన (2), అప్నాదళ్ (సోనేలాల్) (2), ఏజీపీ (2), నేషనల్ పీపుల్స్ పార్టీ (2), రాష్ట్రీయ లోక్దళ్ (2) వంటి పార్టీలున్నాయి. మరో ఎనిమిది చిన్నపార్టీలు ఒక్కోచోట పోటీ చేస్తున్నాయి.
మోదీని దింపడమే లక్ష్యంగా ఇండియా
మోదీ సర్కారును గద్దె దించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే కూటమి ఉండగా.. ఈసారి మరిన్ని పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటైంది. దీని కూర్పులో కీలకంగా వ్యవహరించిన నీతీశ్ కుమార్ (జేడీయూ) చివరి నిమిషంలో ఎన్డీయే గూటికి చేరడం గమనార్హం. కాంగ్రెస్ మునుపెన్నడూ లేనంత తక్కువగా 326 స్థానాల్లోనే పోటీ చేసింది. కూటమిలో ఎస్పీ(62), ఆర్జేడీ(24), డీఎంకే(22), శివసేన(21), శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(10) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటితోపాటు టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆప్, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, వికాశ్శీల్ ఇన్సాన్లతోపాటు మరికొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి.
కూటమిలోనే పోటాపోటీ
కొన్నిచోట్ల సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం, స్థానిక పరిస్థితుల కారణంగా ఇండియా కూటమిలోని పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడ్డాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో దిగాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఎంలు కలిసి పోటీ చేశాయి. ఆప్, కాంగ్రెస్ల మధ్య దిల్లీలో పొత్తు కుదరగా, పంజాబ్లో మాత్రం ప్రత్యర్థులుగా అవి తలపడ్డాయి.
ఏ కూటమిలో చేరకుండా...
ఆంధ్రప్రదేశ్లో వైకాపా, తెలంగాణలో భారాస, ఎంఐఎంలు, ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ, తమిళనాడులో అన్నాడీఎంకే, ఒడిశాలో బిజద, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్లు ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేశాయి. హరియాణాలోని జననాయక్ జనతా పార్టీ చివరి నిమిషంలో ఎన్డీయేను వీడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. -
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?