- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Naga babu: తితిదే ఛైర్మన్ పదవి.. సమాధానమిచ్చిన నాగబాబు..!
నాగబాబు తితిదే ఛైర్మన్ కాబోతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, జనసేన విజయానికి తీవ్రంగా శ్రమించారు సినీ నటుడు, పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు (Naga Babu). ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయానికి అహర్నిశలు శ్రమించారు. ఈ నేపథ్యంలో నాగబాబు తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ పదవిని చేపట్టబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. గురువారం ఉదయం నుంచి ఈ వార్త ట్రెండింగ్లో ఉంది. ఈ విషయంపై నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. అంతేకాదు, తన భవిష్యత్ కార్యాచరణనూ వెల్లడించారు. ‘దయచేసి అసత్య వార్తలను ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.
చిరంజీవి (Chiranjeevi) ఇంటికి పవన్కల్యాణ్ (Pawan Kalyan) వచ్చిన సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్లోనూ నాగబాబు కుటుంబం పాల్గొంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కల్యాణ్బాబు విజయం సాధించిన సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి గెట్ టు గెదర్లా చిన్న పార్టీ చేసుకున్నామన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు వచ్చినట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ కుటుంబం పవన్కు అండగా ఉంటుందన్నారు. పార్టీకి సేవ చేయడం తప్ప పదవులపై తనకు ఆలోచన లేదన్నారు. జనసేనను ఇంకా ఉన్నతస్థానాలకు ఎలా తీసుకెళ్లాలా? అన్న ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం పైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై మరో కుట్ర జరుగుతోంది: హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేంద్రంలోని భాజపాపై విరుచుకుపడ్డారు. భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామని ప్రకటించారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా కలసి పోటీచేస్తాం : శరద్ పవార్
మరో నాలుగు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని శరద్ పవార్ అన్నారు. -
వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. -
పులివెందుల వైకాపాలో పెండింగ్ బిల్లుల పంచాయితీ!
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులపై వైకాపా నాయకుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. -
ఏయూలో అక్రమాలను తవ్వి తీస్తాం
‘వైకాపా పాలనలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక వర్సిటీల ప్రతిష్ఠ మసకబారింది. ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి. -
వైకాపా నేతల చేతుల్లోకి పేదల భూములు
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసమని చేపట్టిన భూసమీకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రైతులను మోసగించి రూ.కోట్ల విలువైన భూములను కొందరు తేలికగా కొట్టేశారు. -
నేడు ‘శక్తి’ కేంద్రాల్లో ‘మన్కీ బాత్’ వినిపించాలి
ప్రధాని మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని ఆదివారం అన్ని ‘శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. -
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఎం
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
మోదీ నైతికంగా ఓడిపోయారు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడియారని, అయినా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా కొనసాగుతున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు. -
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఝార్ఖండ్లో భాజపా మాయం
హవాలా కేసులో తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిన భాజపా.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. -
భారాస హయాంలో రైతుబంధు దుర్వినియోగం: ఎమ్మెల్యే యెన్నం
భారాస ప్రభుత్వ హయాంలో 42 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుబంధు దుర్వినియోగమైందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్పై మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్లున్నారు
‘కేసీఆర్పైన, గత ప్రభుత్వంపైన మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్టుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా మీ మాటల్లో స్పష్టమైంది. -
రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ
‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను. -
పేదల బియ్యంతో అక్రమాల సామ్రాజ్యం
పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
-
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
-
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!
-
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!