Mynampally: ఈ నెల 27లోపు కాంగ్రెస్‌లో చేరతా: మైనంపల్లి

కాంగ్రెస్‌ పార్టీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) జై కొట్టారు.

Updated : 25 Sep 2023 11:37 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) జై కొట్టారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

దిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27 లోపు పార్టీలో చేరతానని చెప్పారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు వివరించారు. అలాగే తన తరఫున నక్క ప్రభాకర్‌కు కూడా మేడ్చల్‌ టికెట్‌ అడిగినట్లు మైనంపల్లి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని