phone tapping: ఫోన్‌ట్యాపింగ్‌తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated : 05 Jul 2024 04:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులతో నాకు కనీస పరిచయాలు కూడా లేవు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఫంక్షన్లలో మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అధికారులు లోతైన దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకోవాలి’ అని ఆ ప్రకటనలో నవీన్‌కుమార్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని